ప్రాణం కన్నా మిన్న! అచ్యుతుని రాజ్యశ్రీ

 మేవాడ్ మహారాణాకి అత్యంత ఆప్తుడు సన్నిహితుడైన బారూజీ తన రాజు దగ్గర తప్ప వేరే ఎవరు ఏమిఇచ్చినా పుచ్చుకునేవాడుకాదు. రాణాయే అతని ప్రాణం సర్వస్వం. ఇద్దరు బాల్యస్నేహితులుకూడా. బారూజీ ప్రసిద్ధ కవిగూడా. అతనికీర్తి ఆత్మాభిమానం దూరతీరాలకు వ్యాపించాయి. పామరుని మొదలు  పండితుల దాకా  ఆయనను ఆదరించే వారు. కాకపోతే అతనిలో అందరికీ  నచ్చని ఒకే ఒక గుణం  రాణా ఇచ్చేది మాత్రమే  తీసుకుని  మిగతా వారివి నిర్మొహమాటంగా తిరస్కరించేవాడు. మిగతా రాజులు  రాణాలకు మనసులో ముల్లులా గుచ్చుకున్నా సమయం కోసం కాచుకున్నారు."నాకు ఉన్నది ఒకేఒక్క ప్రభువు"అని ఖరాఖండిగా చెప్పేవాడు.
మహారాణా మామగారు  బూందీపాలకుడైన మహారావ్ కి గిట్టేదికాదు.కూతురి పెళ్ళి కి వచ్చిన వారందరికీ బోలెడంత నగానట్రా బహుమతులు ఇచ్చాడు.కానీ  బారూజీ వాటిని తీసుకోకుండా నిరాకరించడం మహారావ్ మనసులో ఉండిపోయింది.
 ఒకసారి రాణా తనమామగారి దగ్గరకు సందేశం ఇచ్చిరమ్మని  బారూజీ ని పంపాడు.బూందీవెళ్లిన బారూజీ మహారావ్ ని కలిసి లేఖ ఇచ్చాడు. "ఏమోయ్ !మేమంటే నీకు గౌరవం ఆదరం ఉన్నాయా?మా అల్లుడు  ఒక్కడే నీకు దేవుడు సర్వస్వం కదూ?" అతని వ్యంగ్యం  అర్ధం చేసుకున్న బారూజీ అన్నాడు"మీరు నాకు  పూజనీయులే ప్రభూ!"అన్నాడు."మరి నేనిచ్చిన బహుమతులు ఎందుకు  నిరాకరించావు?"
"అది నా నియమం ప్ర భూ!"
"బారూజీ  అందరు కవులు  నాబహుమతులు ఆనందంగా  స్వీకరించితే నీవు తిరస్కరించావు.నన్ను  బాగా  అవమానించావు.ఇప్పుడు  నేను ఇచ్చే సంభావన దానం తీసుకోకుండా  నీ రాణా దగ్గరకు ఎలా వెళ్తావో చూస్తా."సవాలు విసిరాడు. పైగా బారూజీని అతనితో వచ్చిన సేవకుడిని బందీలుగా కారాగారంలో ఉంచాడు.వారం గడిచినా విడిచి పెట్టకపోటంతో బారూజీ ఒకదృఢనిశ్చయానికి వచ్చాడు. రాణా మామగారు కాబట్టి  కర్రవిరగకుండా పాము చావకుండా  ఉపాయం గా అపాయం దాటాలని నిశ్చయించుకున్నాడు.
అందుకే బైట కాపలావాడి ద్వారా  మహారావ్ కి విన్నపం పంపాడు. అతను వెంటనే  బారూజీని రప్పించాడు."ఏమోయ్  నాదారికి వచ్చినందుకు సంతోషం!బహుమతులు ఇస్తా.సిద్ధం గా ఉండు "  "ప్రభూ!నాదీ ఓ షరతు.నేను ఇచ్చే  నా కానుకను మీరు స్వీకరించి తీరాలి. ""ఓ. అలాగే  !"    "ప్రభూ  ఇప్పుడే  నాగదిలోకి వెళ్లి  మీకు ఇవ్వవలసిన కానుక అందజేస్తాను"  లోపలికి వెళ్ళిన బారూజీ  తన సేవకునితో ఇలా అన్నాడు"నేను  నా శిరస్సుని ఖండించుకుంటున్నా.దీన్ని  ఈపళ్లెంలో పెట్టి  పైన వస్త్రం కప్పి మహారావ్ కి బహూకరించు."నౌకరు బతిమలాడినా వినకుండా సర్రున తన తల నరికేసుకున్నాడు.పాపం!ఆనౌకరు స్వామిభక్తి పరాయణుడు కావటంతో తు.చ.తప్పక బారూజీ చెప్పిన ట్లే చేశాడు. "హు తన పంతం నెగ్గించుకున్నాడు.తన రాణా దగ్గర తప్ప  ఎవరిదగ్గర ఏమీతీసుకోను అన్న  అతని ప్రాణం  నిలువునా తీశాను.నేను ఓడిపోయాను."బాధపడిమహారావ్ చేతులుకాలాక ఆకులు పట్టుకున్న మూర్ఖుడుగా చరిత్ర లో మిగిలాడు.మనం  డబ్బు  పదవి దురాశ తో దేశద్రోహులకి సాయం చేయరాదు. జననీజన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ.ఉగ్రవాదుల భరతం పట్టాలి.మన వీరసైనికులకి  సరిహద్దుల్లో అన్ని బాధలు సహిస్తూన్న వారికి  మన పోలీసులకి  ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటే చాలు.
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
*బహు చక్కని కథలు బక్రిచెప్యాల బాదుషాలు*:- బట్టల సాయిచరణ్-7వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -మం:సిద్ధిపేట -జాల్లా:సిద్ధిపేట
చిత్రం
ఏం కాలం? ఇది పోయే కాలం!:- యలమర్తి అనూరాధ
చిత్రం
విను చూడు!!?:-సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం
*తెలంగాణతొలిశతావధాని* శ్రీమాన్ శ్రీ శిరశినహల్ కృష్ణమాచార్యులు వర్ధంతి నేడు(ఏప్రియల్ 15) కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు జన్మించారు. వీరు బాల్యంలో పితామహులైన సింగారాచార్యులవద్ద మరియు తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. పిమ్మట వల్లంకొండలో కనకాపురం శ్రీనివాసాచార్యుల వద్ద తర్క ప్రకరణాలు, మోర్తాడులో కందోఝల వెంకన్న వద్ద సిద్ధాంత భాగము, పిఠాపురంలో గుదిమెళ్ళ రంగాచార్య వద్ద వేదాంతమును అభ్యసించారు. 1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు. రచనలు-సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని: 1. కళాశాల అభ్యుదయం 2. రామానుజ చరితం 3. చిత్ర ప్రబంధం 4. రత్నమాల (ఖండ కావ్యం) 5. మనస్సందేశ కావ్యము 6. సంపత్కుమార సంభవ కావ్యము 7. గాంధీతాత నీతిశతకము 8. గీతాచార్య మతప్రభావ శతకము 9. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము 10. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము 11. వేణుగోపాల స్వామి సుప్రభాతము 12. నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము 13. పద్మావతీ పరిణయము (హరికథ) 14. రుక్మిణీ కళ్యాణము (హరికథ) 15. ముకుందమాల 16. యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు 17. విశిష్టాద్వైతమత సంగ్రహము 18. వేదార్థ సంగ్రహము (అనువాదం) 19. గురువంశ కావ్యనిధి వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారు. వీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు. మనోవిజయ బాణారంభం అనే మొదటగా రచించినట్లుగా కృష్ణమాచార్యులు రాసుకున్న స్వీయ కవితానుజీవనం అనే గ్రంథంలో రాసుకున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించాలనే మక్కువతో అనేక కష్టాలను ఎదుర్కొంటూ, అసంపూర్తిగానే నిలిపివేసినప్పటికీ, తర్వాతి కాలంలో మద్రాస్ ప్రాంతానికి వెళ్లి తన వాంఛను నెరవేర్చుకున్నారు. కరీంనగర్ పట్టణంపై కంద పద్యాన్ని రాసి, వారి కవితా జీవనాన్ని ప్రారంభించారు. 1929లో కళాశాలఅభ్యుదయ తొలి కావ్యంగా గుర్తింపు పొందింది. 1939లో శతవిధభంగ శతకాన్ని, అభినవ కుచేలోపాధ్యానము గ్రంథాలను రచించారు. నైజాం పరిపాలన సమయంలో కోరుట్ల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన శతావధాని కృష్ణమాచార్యులు, తన తొలి శతావధాన్ని 1928లోనే నిర్వహించారు. ఆనాటి నుండి శతావధానిగా పేరొందిన కృష్ణమాచార్యులు, నైజాం రాష్ట్ర వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో 1946లో పండితరత్న బిరుదు పొందిన కృష్ణమాచార్యులు, హరికథ కాలక్షేపాలు, రామానుజ చరిత్ర, తత్వార్థప్రకాశిక, శృంగారపంచపానవిజయ రచన తదితర గ్రంథాలను రచించారు. ద్రావిడ భాషలోని అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అర్చరాదిమార్గం, శ్రీవచన భూషణం తదితర పుస్తకాలను కూడా రచించిన కృష్ణమాచార్యులు, గాంధీతాత నీతి శతకాన్ని కూడా రచించారు. కులమత బేధాలు వద్దంటూ ఆనాడే తన కవితల ద్వారా సమాజానికి చెప్పిన కృష్ణమాచార్యులు, బాల్య వివాహాలు వద్దని పేర్కొంటునే, బాల వితంతు వివాహాలను ప్రోత్సహించే విధంగా కవితా సంపుటిలను కూడా సమాజానికి అందించారు. 1955లో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన వేదాంత సభల్లో కృష్ణమాచార్యుల గారికి ఘన సన్మానం లభించింది. విద్యాభూషణ, పండితరత్న, ఉభయవేదాంతచార్య తదితర బిరుదులు కృష్ణమాచార్యుల గారికి దక్కిన మణిమకుటాలు. ఎలాంటి సమస్యనైనా క్షణకాలంలో పరిష్కరించి, ఏకసంతాగ్రహిగా కీర్తి ఘడించిన కృష్ణమాచార్యుల గారికి సాక్షాత్యు సరస్వతిదేవియే స్వప్న సాక్షాత్కరించి సమస్యను ఇచ్చినట్లు తన కవితానుజీవనం పుస్తకంలో రాసుకున్నారు. 80సంవత్సరాల వయస్సులో ఏప్రిల్ 15, 1992 రోజున పరమపదాన్ని చేరుకున్న కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను కరీంనగర్‌లో శ్రీ త్రిదండి శ్రీరామన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తన ఇంటి ఇలవేల్పూ నంబులాద్రి లక్ష్మీనర్సింహాస్వామికి రాసిన సుప్రభాతం నేటికి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇటీవలే కృష్ణమాచార్యులు అందించిన మనస్సందేశ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించి హైదరాబాద్‌లో పండితుల సమక్షంలో ఆవిష్కరించి, శతావధాని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. శతావధాని గారి రచనలపై చాలామంది విద్యార్థులు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో పిహెచ్‌డిలు కూడా పూర్తి చేశారు. డాక్టర్ సముద్రాల శ్రీనివాసాచార్య కృష్ణమాచార్య శతావధాని తెలుగు రచనలు పరిశీలన అనే అంశంపై పై పీ.హెచ్. డీ చేశారు. వారి కుమారులు శిరిశినహళ్ వెంకటాచారి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు--డాక్టర్ . అమ్మిన శ్రీనివాస రాజు
చిత్రం