1. తరమున పోరుసల్పెనిట దాశరథీ తెలగాణ వీరుడున్ ,
కరమున ఖడ్గమై కలము గైకొని యక్షర సేద్యమున్ నిడన్ ,
శరములయగ్నిధార నిల శౌర్య ము తోడను కుమ్మరించెనే ,
వరముయె కృష్ణమార్యులును పండిత పామర మానవాళి కిన్.
2.కనకము రాష్ట్రమందితడు కావలె గొప్పగ వేడుకల్ని లన్ ,
జనములు మెచ్చగా సమర శంఖమునూదెనుకావ్య సృష్టితో ,
మననము జేసుకోవలెను మా నస మందున కృష్ణమార్యు నిన్ ,
అనయము వందనమ్మిడి మ హాత్ముడు దాశరథిన్ ధరాస్థలిన్ .

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి