ఇంటా -బయట .. !! (బొమ్మల తిండి ) డా . కె ఎల్ వి ప్రసాద్ (హన్మకొండ )9866252002.

 పిల్లలు, పాలు -పళ్ళ రసాలవంటి ద్రవ ఆహార పదార్ధాల స్థాయి దాటిపోయిన తర్వాత ‘ అన్నప్రాసన ‘ వంటి తతంగాలు పూర్తి చేసి ,ఆ తర్వాత ఘన పదార్ధా
లు తినిపించడం మొదలు పెడతారు . ఈ వయస్సులో పిల్లలకు తిండి తినిపిం
చడం పెద్ద సవాలే !ఎందుచేతనంటే ఘన పదార్ధాలు తినడం ఒకేసారి కొత్తఆవు 
తుంది . ఆహరం నమలడం అనే ప్రక్రియ సహజ సిద్దంగానే అప్పుడప్పుడే నేర్చు కోవడం మొదలుపెడతారు . అదికూడా చాలా నెమ్మదిగా జరుగుతుంది
తొందరపెడితే నమలడం మాని మింగడం మొదలు పెడతారు . అందుకనే పిల్లల్ని ఎత్తుకుని పాటలు పాడుతూ ఓపిగ్గా మెలమెల్లగా తల్లి తినిపిస్తుంది.
అది ఒకపట్ఠాన అయ్యేపనికాదు . తల్లికి ఈ విషయంలో ఎంతో నేర్పు-ఓర్పు 
సహనం అవసరం . ఈ లక్షణాలు లేని తల్లి విసుక్కుంటూ తినిపించడం ,లేదా 
ఒక్కోసారి వీపు మీద దెబ్బలు వేసే అమ్మలు కూడా వుంటారు . ముఖ్యంగా 
ఆ వయస్సులో పిల్లలకు తల్లి ,బిడ్డకు తిండితో పాటు ప్రేమను కూడా పంచిన--
ప్పుడు మాత్రమే ఆ పిల్లలు తల్లిదగ్గర పూర్తి స్థాయి ప్రేమను పొంది తిన్న తిండి
కి ,పూర్తి సార్ధకతను పొందుతారు . తిన్న ఆహారం చక్కగా జీర్ణమై రక్తంగామారి 
బిడ్డకు పుష్టిని కలిగిస్తుంది . 
ఆధునిక కాలంగా చెప్పబడే ఈరోజుల్లో అంతా యాంత్రిక జీవితం అయిపొయిం
ది .ఉద్యోగిని అయిన తల్లి అయితే ఆధునికత మరింత రెట్టింపు అయి ఈ ఆహరం తినిపించే ప్రక్రియ ఆయాల చేతికో ,పనిమనుష్యుల చేతికో వెళ్లి పిల్ల 
లకు మరింత కష్టకాలం ప్రాప్తిసుంది . పిల్లల తిండి పూర్తిగా యాంత్రికం అయి-
పోతుంది . అంతా సంరక్షకుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది . 
అయితే అందరూ ఇలానే ఉంటారని చెప్పలేముగాని,పూర్తిగా నమ్మేటట్లు ఉండదు పరిస్థితి . పని మనుష్యుల చేతితో పిల్లలకు ఆహరం తినిపించడం ఇష్టం లేని తల్లులు కొందరు ,ఆహరం తినిపించడానికి ‘ చంచా (స్పూన్ )వాడి 
స్తారు . ఇది పూర్తిగా కృత్రిమ ప్రక్రియ ,బిడ్డకు తృప్తినివ్వని ,వంటపట్టని వ్య-
వహారం !కొందరు ఇలా స్పూన్ వాడడం ఆధునికత్వం అనుకుని పొరబడుతుం
టారు . మరికొంతమంది పరిశుభ్రతకు ఇదే మంచి సాధనం అనుకుని భ్రమ--
పడుతుంటారు. కానీ అది పద్దతి కాదు. ఏమాత్రం వీలున్నా చేతితో తినిపించడ
మే మేలు . అంతమాత్రమే కాదు . సాధ్యమయినంత త్వరలో పిల్లలు స్వయం
గా చేతితో కలుపుకుని తినే అలవాటు చేయాలి . మొదట్లో చిందరవందరగా అన్నం పడేస్తారు తెలియక . క్రమంగా నేర్చుకుంటారు .
ఇప్పుడు పిల్లలు గొడవచేయకుండా ఒకచోట కూర్చుని తిండి తినడానికి ఆధు
నిక తల్లి కనిపెట్టిన సాధనాలు ‘ టీవి,ట్యాబ్ ,మొబైల్ ‘ వీటిలో కార్యక్రమాలు చూపిస్తూ పిల్లలకు తిండి తినిపిస్తున్నారు . కేవలం వారి సౌలభ్యం కోసం పిల్లలకు ఈ అలవాటు చేయడం ఎంత దారుణం . తర్వాత కాలంలో పిల్లలు అవి లేకుండా భోజనం చేయలేని పరిస్థితి ఏర్పడుతున్నది . ఆ తర్వాత పిల్లలు పూర్తిగా వీటికి బానిసలుగా మారే ప్రమాదమూ వుంది . అందుచేత తల్లి దండ్రులు ,సంరక్షకులు ముఖ్యంగా తల్లులు ఈ విషయంలో అప్రమత్తంగా 
ఉండాలి . ఈ అలవాటు చేయక పోతేనే మంచిది . ఏ ఇతర అంశాల మీద ద్యాస లేకుండా ప్రశాంతంగా భోజనం తినేలా పిల్లలకు నేర్పించడం తెలివైన తల్లి 
తెలివిగా చేయవలసిన పని . తల్లులూ ఆలోచించండి !పిల్లల ఆరోగ్యం భవిష్య--
త్తు మీ చేతిలోనే ఉందన్న విషయం మర్చిపోకండి . 
                                   ***

కామెంట్‌లు
Popular posts
సింప్లిసిటీ!!;- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని.
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
విను చూడు!!?:-సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం
*తెలంగాణతొలిశతావధాని* శ్రీమాన్ శ్రీ శిరశినహల్ కృష్ణమాచార్యులు వర్ధంతి నేడు(ఏప్రియల్ 15) కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు జన్మించారు. వీరు బాల్యంలో పితామహులైన సింగారాచార్యులవద్ద మరియు తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. పిమ్మట వల్లంకొండలో కనకాపురం శ్రీనివాసాచార్యుల వద్ద తర్క ప్రకరణాలు, మోర్తాడులో కందోఝల వెంకన్న వద్ద సిద్ధాంత భాగము, పిఠాపురంలో గుదిమెళ్ళ రంగాచార్య వద్ద వేదాంతమును అభ్యసించారు. 1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు. రచనలు-సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని: 1. కళాశాల అభ్యుదయం 2. రామానుజ చరితం 3. చిత్ర ప్రబంధం 4. రత్నమాల (ఖండ కావ్యం) 5. మనస్సందేశ కావ్యము 6. సంపత్కుమార సంభవ కావ్యము 7. గాంధీతాత నీతిశతకము 8. గీతాచార్య మతప్రభావ శతకము 9. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము 10. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము 11. వేణుగోపాల స్వామి సుప్రభాతము 12. నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము 13. పద్మావతీ పరిణయము (హరికథ) 14. రుక్మిణీ కళ్యాణము (హరికథ) 15. ముకుందమాల 16. యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు 17. విశిష్టాద్వైతమత సంగ్రహము 18. వేదార్థ సంగ్రహము (అనువాదం) 19. గురువంశ కావ్యనిధి వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారు. వీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు. మనోవిజయ బాణారంభం అనే మొదటగా రచించినట్లుగా కృష్ణమాచార్యులు రాసుకున్న స్వీయ కవితానుజీవనం అనే గ్రంథంలో రాసుకున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించాలనే మక్కువతో అనేక కష్టాలను ఎదుర్కొంటూ, అసంపూర్తిగానే నిలిపివేసినప్పటికీ, తర్వాతి కాలంలో మద్రాస్ ప్రాంతానికి వెళ్లి తన వాంఛను నెరవేర్చుకున్నారు. కరీంనగర్ పట్టణంపై కంద పద్యాన్ని రాసి, వారి కవితా జీవనాన్ని ప్రారంభించారు. 1929లో కళాశాలఅభ్యుదయ తొలి కావ్యంగా గుర్తింపు పొందింది. 1939లో శతవిధభంగ శతకాన్ని, అభినవ కుచేలోపాధ్యానము గ్రంథాలను రచించారు. నైజాం పరిపాలన సమయంలో కోరుట్ల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన శతావధాని కృష్ణమాచార్యులు, తన తొలి శతావధాన్ని 1928లోనే నిర్వహించారు. ఆనాటి నుండి శతావధానిగా పేరొందిన కృష్ణమాచార్యులు, నైజాం రాష్ట్ర వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో 1946లో పండితరత్న బిరుదు పొందిన కృష్ణమాచార్యులు, హరికథ కాలక్షేపాలు, రామానుజ చరిత్ర, తత్వార్థప్రకాశిక, శృంగారపంచపానవిజయ రచన తదితర గ్రంథాలను రచించారు. ద్రావిడ భాషలోని అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అర్చరాదిమార్గం, శ్రీవచన భూషణం తదితర పుస్తకాలను కూడా రచించిన కృష్ణమాచార్యులు, గాంధీతాత నీతి శతకాన్ని కూడా రచించారు. కులమత బేధాలు వద్దంటూ ఆనాడే తన కవితల ద్వారా సమాజానికి చెప్పిన కృష్ణమాచార్యులు, బాల్య వివాహాలు వద్దని పేర్కొంటునే, బాల వితంతు వివాహాలను ప్రోత్సహించే విధంగా కవితా సంపుటిలను కూడా సమాజానికి అందించారు. 1955లో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన వేదాంత సభల్లో కృష్ణమాచార్యుల గారికి ఘన సన్మానం లభించింది. విద్యాభూషణ, పండితరత్న, ఉభయవేదాంతచార్య తదితర బిరుదులు కృష్ణమాచార్యుల గారికి దక్కిన మణిమకుటాలు. ఎలాంటి సమస్యనైనా క్షణకాలంలో పరిష్కరించి, ఏకసంతాగ్రహిగా కీర్తి ఘడించిన కృష్ణమాచార్యుల గారికి సాక్షాత్యు సరస్వతిదేవియే స్వప్న సాక్షాత్కరించి సమస్యను ఇచ్చినట్లు తన కవితానుజీవనం పుస్తకంలో రాసుకున్నారు. 80సంవత్సరాల వయస్సులో ఏప్రిల్ 15, 1992 రోజున పరమపదాన్ని చేరుకున్న కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను కరీంనగర్‌లో శ్రీ త్రిదండి శ్రీరామన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తన ఇంటి ఇలవేల్పూ నంబులాద్రి లక్ష్మీనర్సింహాస్వామికి రాసిన సుప్రభాతం నేటికి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇటీవలే కృష్ణమాచార్యులు అందించిన మనస్సందేశ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించి హైదరాబాద్‌లో పండితుల సమక్షంలో ఆవిష్కరించి, శతావధాని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. శతావధాని గారి రచనలపై చాలామంది విద్యార్థులు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో పిహెచ్‌డిలు కూడా పూర్తి చేశారు. డాక్టర్ సముద్రాల శ్రీనివాసాచార్య కృష్ణమాచార్య శతావధాని తెలుగు రచనలు పరిశీలన అనే అంశంపై పై పీ.హెచ్. డీ చేశారు. వారి కుమారులు శిరిశినహళ్ వెంకటాచారి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు--డాక్టర్ . అమ్మిన శ్రీనివాస రాజు
చిత్రం
*బహు చక్కని కథలు బక్రిచెప్యాల బాదుషాలు*:- బట్టల సాయిచరణ్-7వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -మం:సిద్ధిపేట -జాల్లా:సిద్ధిపేట
చిత్రం