భావి పౌరులు;-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట
బడికి వచ్చేన పిల్లలంత
పుస్తకాలను తెరిచి కొంత 
మల్లి మల్లిచదివినంత 
అర్థమవును ఎంతోకొంత

వినయమన్నది పెరుగును
విద్యా లెన్నో వచ్చును 
రాణి వెన్నో ఉన్నాగాని 
భక్తి తోడ వచ్చి చేరును

అనుభవాలను కలిగినవారు 
గురువులంతా గొప్పవారు
భావి భారత పౌరులు మీరు
విద్యలెన్నో నేర్చేవారు.

కామెంట్‌లు