మనంఆరోగ్యంగా ఉన్నపుడే.. !(* బాలగేయం *) కోరాడ నరసింహా రావు.
పిల్లలూ.... !
  మీరు చక్కగ చదువులు చదవా లన్నా.... 
 గొప్పవారిగా ఎదగాలన్నా ... 
 సుఖ, సంతోషాలతో ... 
 ఆనందంగా  బ్రతకాలన్నా... 
 మొదట ఆరోగ్యంగాఉండాలి !
ఆరోగ్యమే మహాభాగ్యమని... 
 అన్నారందుకే పెద్దలు !!

మనం ఆరోగ్యంతో ఉండాలంటే 
పరిశుభ్రత పాటించాలి !
 ప్రతిదినమూ వేళకు లేచి... 
 కాలకృత్యములు తీర్చుకుని 
 చక్కగ స్నానము చేయాలి... 
 ఉతికినబట్టలు కట్టాలి !

స్కూలు బేగులు, పుస్తకము లను పరిశుభ్రంగా ఉంచాలి, వేళకు బడికి వెళ్ళాలి, క్రమశిక్షణతో మెలగాలి !

  వీధిలో...  ఈగలు వాలినవి.. 
  కుళ్ళినపళ్ళు, పాచినచిరు     తిళ్ళు.... అస్సలు తిననే తిన కూడదు  ! 
 వాంతులు, విరేచనాలతో... 
 అవి మనఆరోగ్యానికి కీడును  
 చేస్తాయి !

అది స్కూలైనా, పార్కైనా... 
ఇంటినుండి బయట కెక్కడికి వెళ్లి,వచ్చినా...కాళ్ళూ,చేతులు 
ఒళ్ళంతా సబ్బు,నీళ్లతో చక్కగా
శుభ్రం చేసుకోకపోతే.... 
     గజ్జి, తామరవంటివి ఎన్నో  
జబ్బులు వస్తాయి !   ఎంతో చీకాకును కలిగిస్తాయి !

మనముశుభ్రంగాఉంటేచాలదు 
మనఇల్లూ, పరిసరాలూ.... 
   పరి శుభ్రంగా ఉండాలి !
ఎక్కడపడితే అక్కడ... చెత్తను వేసి,మురుగునీరుపారక,నిలవ 
ఉండి పొతే....దోమలు పెరిగి... 
రక -  రకాలజ్వరాలతోజబ్బులు చేసి,ప్రాణాలకే ముప్పురావచ్చు
 
 మన మారోగ్యంగా ఉన్నపుడే 
బుద్ది బాగా వికసించి, చక్కగ చదువులు చదవ గలం... !
 గొప్పవారిగా ఎదగగలం... !!
 సుఖ, సంతోషాలతో... 
  ఆనందంగా  బ్రతక గలం !!!
     *******

కామెంట్‌లు