నీరజాభనోట్ పేరు అపరిచితం .కానీ ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టి 400మంది విమానప్రయాణీకులను కాపాడిన సమయస్ఫూర్తి సాహసం ఉన్న తరుణి! బాల్యం నుంచి ముద్దుమురిపాలలో పెరిగిన అందాలబాల నీరజాభనోట్! సినిమాలంటే తగని పిచ్చి! రాజేష్ ఖన్నా సినిమాలు తెగచూసేది.7సెప్టెంబర్ 1963లో చండీగఢ్ లో పంజాబీ కుటుంబంలో పుట్టింది. తండ్రి పత్రికా విలేఖరి. నీరజ ముంబై సెయింట్ జేవియర్ కాలేజీ నించి డిగ్రీ పొందింది. 1985లో వ్యాపారవేత్త తో పెళ్లి ఐంది. కానీ గృహహింస కి గురియై రెండు నెలలకల్లా పుట్టిల్లు చేరింది. మోడలింగ్ చేస్తుండగా ఏయిర్ హోస్టెస్ ఉద్యోగం రావటం ఓపెద్ద మలుపు. 1986లో కరాచీలో విమానం బైలుదేరే సమయానికి నలుగురు టెర్రరిస్టులు పైలట్ ప్రయాణీకులని తుపాకులతో బెదిరించారు. హైజాక్ చేసే ప్రయత్నంలో ఉన్నారు.నీరజ సమయస్ఫూర్తి తో తలుపు తెరిచి విమానం లో వారిని బైట కి పంపేసి తాను మాత్రం దుండగుల తుపాకీకి బలైంది.2016లో సోనంకపూర్ నటించిన బయోపిక్ విడుదల కావటంతో నీరజ త్యాగం లోకానికి వెల్లడైంది. భారత ప్రభుత్వం అశోక చక్రతో నివాళి అర్పించింది.ఇంకో విశేషం ఏమంటే పాకిస్తాన్ ప్రభుత్వం కూడా తమగా-ఎ-ఇంసానియత్ ప్రదానం చేసింది. 2004లో ఆమె స్మారక తపాలా బిళ్ళ విడుదల ఐంది. పిన్న వయసులో ఎలాంటి సుఖసంతోషాలు నోచుకోకుండా తన ప్రాణాలను అర్పించి విమానప్రయాణీకులను కాపాడిన నీరజా భనోట్ చిరస్మరణీయురాలు🌷
అశోకచక్ర పొందిన తొలి భారతీయ వనిత! (అచ్యుతుని రాజ్యశ్రీ)
నీరజాభనోట్ పేరు అపరిచితం .కానీ ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టి 400మంది విమానప్రయాణీకులను కాపాడిన సమయస్ఫూర్తి సాహసం ఉన్న తరుణి! బాల్యం నుంచి ముద్దుమురిపాలలో పెరిగిన అందాలబాల నీరజాభనోట్! సినిమాలంటే తగని పిచ్చి! రాజేష్ ఖన్నా సినిమాలు తెగచూసేది.7సెప్టెంబర్ 1963లో చండీగఢ్ లో పంజాబీ కుటుంబంలో పుట్టింది. తండ్రి పత్రికా విలేఖరి. నీరజ ముంబై సెయింట్ జేవియర్ కాలేజీ నించి డిగ్రీ పొందింది. 1985లో వ్యాపారవేత్త తో పెళ్లి ఐంది. కానీ గృహహింస కి గురియై రెండు నెలలకల్లా పుట్టిల్లు చేరింది. మోడలింగ్ చేస్తుండగా ఏయిర్ హోస్టెస్ ఉద్యోగం రావటం ఓపెద్ద మలుపు. 1986లో కరాచీలో విమానం బైలుదేరే సమయానికి నలుగురు టెర్రరిస్టులు పైలట్ ప్రయాణీకులని తుపాకులతో బెదిరించారు. హైజాక్ చేసే ప్రయత్నంలో ఉన్నారు.నీరజ సమయస్ఫూర్తి తో తలుపు తెరిచి విమానం లో వారిని బైట కి పంపేసి తాను మాత్రం దుండగుల తుపాకీకి బలైంది.2016లో సోనంకపూర్ నటించిన బయోపిక్ విడుదల కావటంతో నీరజ త్యాగం లోకానికి వెల్లడైంది. భారత ప్రభుత్వం అశోక చక్రతో నివాళి అర్పించింది.ఇంకో విశేషం ఏమంటే పాకిస్తాన్ ప్రభుత్వం కూడా తమగా-ఎ-ఇంసానియత్ ప్రదానం చేసింది. 2004లో ఆమె స్మారక తపాలా బిళ్ళ విడుదల ఐంది. పిన్న వయసులో ఎలాంటి సుఖసంతోషాలు నోచుకోకుండా తన ప్రాణాలను అర్పించి విమానప్రయాణీకులను కాపాడిన నీరజా భనోట్ చిరస్మరణీయురాలు🌷
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి