అంతర్జాతీయ ప్రపంచ శాంతి సంస్థ సమావేశం లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ గౌరవ సభ్యుడు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
*ఇంటర్నేషనల్ యూత్ ఫీస్ గ్రూప్ ( హెచ్. డబ్యూ. పి. ఎల్ ) కోరియా* వారు భారతీయ కాలమానం శనివారం సాయంత్రం 4.30 గంటలకు *ప్రపంచ శాంతి అభివృద్ధి* అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ వెబినార్లో మన దేశం నుండి ఐ.పి.పై.జి సంస్థ ప్రతినిధి గా -డా.చిటికెన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ఇంకా ప్రపంచ శాంతి అభివృద్ధి చెందాల్సి ఉందని అందుకు కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని ( వీ..ఆర్..వన్ ) అంటూ తన సందేశాన్ని అందించారు. తనతో పాటుగా దాదాపు 40 వివిధ దేశాల నుండి సంస్థ ప్రతినిధులు హాజరై వారి వారి సందేశాలు తెలియజేసారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి