నీచ బుద్ధి;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 వేమన ఏ కాలం వాడు, ఏ కులం వాడు ఎక్కడ నివసించాడు అనేది ఎవరికి ఏ ఆధారాలతో చెప్పిన దాఖలాలు దొరకలేదు  అయినా ఉజ్జాయింపుగా ఏడవ శతాబ్దంలో నివసించిన వాడై ఉండవచ్చును  అని వారి పద్యశైలిని బట్టి  కొన్ని ఆశతాబ్దంలో వాడిన శబ్దాలను  ఆధారం చేసుకుని  ఈ నిర్ణయం తీసుకున్నారు  ఏది ఏమైనా వేమనకు ముందు కానీ తరువాత కానీ ఆయన సమయంలో కానీ  మానవుని బుద్ధి ఒకే రకంగా పనిచేస్తూ ఉంటుంది  పెద్దలు చెప్పినట్లు  సాత్విక రాజస తామసాలు తప్ప మరొక దానికి తావులేదు  ఎదుటివారి బలాన్ని చూసుకొని  తన మనోబలాన్ని పెంచుకునే  దురాత్ములు కొందరు ఆ రోజునా ఉన్నారు  ఈ రోజున కూడా మనం కళ్లారా చూస్తున్నాం  ప్రభుత్వ అధికారులలో ఉన్న వారి  స్నేహంతో  అమాయకుల భూములను ఆక్రమణ చేస్తున్నవారు  వాటిని నాశనం చేస్తున్నవారు  మనకు కనిపిస్తూనే ఉన్నారు. వీరు చేస్తున్న అకృత్యాలను  అడ్డుకునేవారు  వారి పరిసరాలలో ఎవరో ఉండరు  ఎవరైనా ఒకరిద్దరున్నా  అవతలివాడి బలగాన్ని చూసి  ముందుకు వచ్చే ధైర్యం చేయరు  అసలీ ప్రపంచంలో ఇలాంటి చెడ్డవారి సంఖ్య  7-8 శాతానికి మించదు.  అయినా అంత అల్ప సంఖ్యలో ఉన్న వారిని చూసి  ఇంతమంది భయపడడం ఆశ్చర్యాన్ని కలగచేస్తుంది  దీనికి కారణం ఎవరికి వారు భయపడటం అనేది కాకుండా  వీరిలో ఐక్యత భావం లేకపోవడం  అని పెద్దల సుద్ధి  అయితే ఈ అక్రమాలు దౌర్జన్యాలు  ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తికి తెలియకుండా ఉంటుందా  తెలిసినా ఊరుకుంటుందా  ప్రతీకారం చేయదా  అన్నదానికి సమాధానంగా  ఈ అమాయకుల ఉసురు  తగలకపోదు అని వేమన చెబుతున్నారు  మరి అది  అతీత శక్తికి అసాధ్యమైనది కాదు కదా. దానికి వేమన చక్కటి ఉపమానం చెబుతున్నారు  మనం సామాన్యంగా పిల్లలు బయట ఆడుకోవడం చూస్తుంటాం  ఎక్కువమంది చిన్నచిన్న బంతులను తీసుకొని  వాటిని పైకి ఎగరవేస్తూ  తిరిగి పట్టుకొని మళ్ళీ ఎగరవేయడం అదొక ఆట  ఆ బంతిని పైకి ఎగరవేసినప్పుడు ఎంతసేపు ఆ గాలిలో ఉంటుందా బంతి  క్షణాలలో తిరిగి  ఈ బాలుని చేతులకు వచ్చేదే కదా  దాని ఉనికి ఆకాశంలో  ఇలాంటి దుష్టులు నీచులు చేసే పని కూడా  ఆకాశంలో ఉన్న బంతిలాగా  కొన్ని క్షణాలు కాకపోతే కొన్ని రోజుల కైనా  కింద పడి అవమానాల పాలు కావడం తప్పదు. కనుక నీతికి నియమానికి కట్టుబడి  సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెంచుకొని  బుద్ధిగా మంచిగా బ్రతకమని  వేమన చెప్తున్న నీతి  వారు రాసిన ఆట వెలదిని  ఒక్కసారి మననం చేయండి.

"భూపతి కృప నమ్మి భూమి జెరుచువాడు  
ప్రజల యుసురు దాకి పడును పిదప  నెగురవేయు బంతి యందాక నిల్చురా..."



కామెంట్‌లు
ఆయుర్వేద బాపయ్య చెప్పారు…
మానవతావాదంలో మనిషి తనను తాను ఎప్పుడు నీతివంతంగా తీర్చిదిద్దుకుంటూ సామాజిక హితమును సాయమును లౌకికమును ఆనందిస్తూ ముక్తి పొందాలి అదే పరమార్ధం.