అన్నదానం చేయడమే తప్ప అన్నం అమ్ముకునే సంస్కృతి మనది కాదు, అన్నము అంటే ఏమిటి
అన్నదానం అంటే ఏమిటి అన్నదాన మహిమ ఏమిటో తెలుసుకుందాం
అన్నదానం గురించి తెలుసుకోవడానికి ముందు అన్నము గురించి తెలుసుకుందాం ...
అన్నము అంటే ఏమిటి అంటే ఒక్కమాటలో
అన్నం పరబ్రహ్మ స్వరూపం ! అని చెప్పారు మన పెద్దలు, మనలో చాలా మందికి " అన్నము " అంటే పూర్తి అర్థం తెలియదు . బియ్యాన్ని ఉడికించి చేసిన పదార్ధాన్నే అన్నము అంటారని అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి ప్రాణం నిలుపుకోవటానికి జీవించటానికి మనం తినే ప్రతి పదార్థము కూడా అన్నమే, ప్రతి మనిషికి పంచ కోశములు అని అయిదు కోశములు ఉంటాయి. అవి అన్నమయ , ప్రాణమయ , మనోమయ , విజ్ఞానమయ , ఆనందమయ కోశములు . అన్నమయ కోశము స్థూల శరీరానికి సంబందించినది. ఈ అన్నమయ కోశములో ప్రవేశించే అన్నము ప్రాణ శక్తిగా మారుతున్నది.కనుక అన్నమయ కోశములోనికి వెళ్ళే పదార్థమే అన్నము అని అర్ధం .
అంతే కాదు తైత్తిరీయోపనిషత్తులో అన్నము వలననే భూతజాతములు జనించు చున్నవి. అన్నము వలననే జీవించు చున్నవి. తుదకు అన్నము నందే (భూమి) నశించు చున్నవి లేక లయించు చున్నవి అని చెప్పబడి ఉంది . మనము ఏది తిన్నా అది అన్నమే అవుతుంది కేవలం బియ్యం ఉడికించినది మాత్రమే అన్నము కాదు అని అర్ధం చేసుకోవాలి .
అన్నదానం అంటే ఏమిటి
అన్నమే అన్నకోశములో ప్రవేశించి ప్రాణంగా మారుతున్నందువలన అన్నదానం అంటే ప్రాణాన్ని దానం చేయడమే అని అర్థము, అంతే కాదు ఒక ప్రాణం నిలవడానికి కావలసిన ప్రతీది అన్నమే, కనుక అన్నదానం చేయడం శ్రేష్టం అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఏదైనా దానం చేసేప్పుడు ఎవరికి చేయాలి,ఎంత చేయాలి, ఎందుకు చేయాలి అనే విచక్షణ అవసరం, కానీ అన్నదానానికి మాత్రం ఈ నియమం లేదు . ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం అంటే వాళ్ళ ప్రాణాన్ని నిలపడమే కనుక అది అత్యంత శ్రేష్టం అయినది .
అన్నము , ఆహార పదార్ధాలు అమ్మవచ్చా
అన్నము ఇతర ఆహార పదార్ధాలను విక్రయించడం మహా పాపం అని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. అందుకే అన్నము దానము మాత్రమే చేయాలి కానీ అమ్మకూడదు, జీవించటానికి హోటళ్లు లాంటివి నడుపుకోవటాన్ని ఇప్పుడు తప్పుగా పరిగణించలేం, కాలమాన పరిస్థితుల్లో కొన్ని విషయాలు అప్రధానంగా భావించాలి.
అన్నదాన మహిమ చెప్పే కథ
పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు కాశీ యాత్రకు బయలుదేరాడు. ఆరోజుల్లో ప్రయాణ సాధనాలు, సరైన రహదారి వ్యవస్థ ఇంతగా లేనందున కాశీ చేరడానికి వారున్న ప్రాంతాలను బట్టి కొన్ని నెలలు ప్రయాణించాల్సి వచ్చేది. యాత్రికులు మధ్యలో గ్రామాల్లో రాత్రుళ్లు బస చేస్తూ వెళ్లేవారు.అప్పట్లో కాశీకి వెళ్తే కాటికి వెళ్లినట్టే అనేవారు, ఎందుకంటే అసౌకర్యాల కారణంగా వెళ్లిన తిరిగి రావడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి, అలాంటి పరిస్థితుల్లో ఒక బ్రాహ్మణుడు కాశీ యాత్రకు బయలుదేరాడు,అయితే ఈ బ్రాహ్మణుడు ఏదో ఆలస్యం కారణంగా చీకటి పడే సమయానికి తాను వెళ్లవలసిన గ్రామానికి చేరుకోలేకపోయాడు. చీకటి పడింది. బస చేయటానికి ఏ అవకాశం ఉందా అని ఆలోచిస్తే ఏమి చేయాలో అతనికి తోచలేదు. అయితే ఆ నిర్జన ప్రదేశం లో అదృష్టవశాత్తు ఒక కోయవాని ఇల్లు కనబడింది. వెంటనే బ్రాహ్మణుడు అక్కడకు వెళ్లి ఆశ్రయం కోరాడు. శంబరుడు అనే ఆ కోయవాడు ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకొని తన వద్ద ఉన్న వెదురు బియ్యం, తేనె తినడానికి ఇచ్చాడు. తన కుటీరం చిన్నదైనందున దానిలో పడుకోమని, తాను బయట కాపలాగా ఉంటానన్నాడు. కానీ ఆరోజు అర్ధరాత్రి ఒక పులి అతనిపై అదను చూసి దాడిచేసి, చంపివేసి, దేహాన్ని తీసుకుపోయింది.తెల్లవారి ఇదిచూసిన బ్రాహ్మణుడు బిక్కచచ్చిపోయాడు. కోయవాని మరణానికి చింతించి, తన దారిన తాను వెళ్లాడు. కాశీ చేరాడు. దైవదర్శనం చేసుకున్నాడు.
ఈ బ్రాహ్మణునికి ఎప్పటినుంచో అన్నదానం గొప్పతనం తెలుసుకోవాలనే కోరిక ఉండేది. తన ఇష్టదైవమైన విశ్వేశ్వరుడు ఆ సందేహం తీరిస్తే బావుండునని అనుకున్నాడు. ఆరోజు రాత్రి విశ్వేశ్వరుడు అతనికి కలలో కనిపించి, నువ్వు తిరుగు ప్రయాణంలో ఒక రాజ్యం మీదుగా వెడతావు. అక్కడి రాజుకు ఒక పుత్రుడు జన్మించి ఉంటాడు. ఆ శిశువును ఏకాంతంగా ఆశీర్వదించు అని చెప్పాడు. ఎందుకో చెప్పలేదు. బ్రాహ్మణుడు అలాగే చేశాడు. రాజకుమారుణ్ణి ఏకాంతంగా ఆశీర్వదించేందుకు వెళ్లాడు. చంటి పిల్లవాడైన ఆ రాజకుమారుడు, ఈ బ్రాహ్మణుణ్ణి చూసి నవ్వి, ఓయీ బ్రాహ్మణా! నన్ను గుర్తుపట్టావా, నేను కోయవాణ్ణి. శంబరుణ్ణి. నీకు ఒక్క రాత్రి అన్నదానం చేయడం వల్ల ఈ జన్మలో నాకు రాజయోగం సిద్ధించింది అన్నాడు. మరుక్షణం అతనికి మళ్లీ పూర్వజన్మ జ్ఞానం నశించి మామూలు శిశువుల మాదిరి ఆడుకోవడం మొదలెట్టాడు. బ్రాహ్మణుని సంశయం తీరింది.
ఈ కథ సంగతి ఎలా ఉన్నా అన్నదాన మహిమ ఎంతటి గొప్పదో ఈ కథ చెబుతుంది.
అన్నదానం అంటే ఏమిటి అన్నదాన మహిమ ఏమిటో తెలుసుకుందాం
అన్నదానం గురించి తెలుసుకోవడానికి ముందు అన్నము గురించి తెలుసుకుందాం ...
అన్నము అంటే ఏమిటి అంటే ఒక్కమాటలో
అన్నం పరబ్రహ్మ స్వరూపం ! అని చెప్పారు మన పెద్దలు, మనలో చాలా మందికి " అన్నము " అంటే పూర్తి అర్థం తెలియదు . బియ్యాన్ని ఉడికించి చేసిన పదార్ధాన్నే అన్నము అంటారని అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి ప్రాణం నిలుపుకోవటానికి జీవించటానికి మనం తినే ప్రతి పదార్థము కూడా అన్నమే, ప్రతి మనిషికి పంచ కోశములు అని అయిదు కోశములు ఉంటాయి. అవి అన్నమయ , ప్రాణమయ , మనోమయ , విజ్ఞానమయ , ఆనందమయ కోశములు . అన్నమయ కోశము స్థూల శరీరానికి సంబందించినది. ఈ అన్నమయ కోశములో ప్రవేశించే అన్నము ప్రాణ శక్తిగా మారుతున్నది.కనుక అన్నమయ కోశములోనికి వెళ్ళే పదార్థమే అన్నము అని అర్ధం .
అంతే కాదు తైత్తిరీయోపనిషత్తులో అన్నము వలననే భూతజాతములు జనించు చున్నవి. అన్నము వలననే జీవించు చున్నవి. తుదకు అన్నము నందే (భూమి) నశించు చున్నవి లేక లయించు చున్నవి అని చెప్పబడి ఉంది . మనము ఏది తిన్నా అది అన్నమే అవుతుంది కేవలం బియ్యం ఉడికించినది మాత్రమే అన్నము కాదు అని అర్ధం చేసుకోవాలి .
అన్నదానం అంటే ఏమిటి
అన్నమే అన్నకోశములో ప్రవేశించి ప్రాణంగా మారుతున్నందువలన అన్నదానం అంటే ప్రాణాన్ని దానం చేయడమే అని అర్థము, అంతే కాదు ఒక ప్రాణం నిలవడానికి కావలసిన ప్రతీది అన్నమే, కనుక అన్నదానం చేయడం శ్రేష్టం అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఏదైనా దానం చేసేప్పుడు ఎవరికి చేయాలి,ఎంత చేయాలి, ఎందుకు చేయాలి అనే విచక్షణ అవసరం, కానీ అన్నదానానికి మాత్రం ఈ నియమం లేదు . ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం అంటే వాళ్ళ ప్రాణాన్ని నిలపడమే కనుక అది అత్యంత శ్రేష్టం అయినది .
అన్నము , ఆహార పదార్ధాలు అమ్మవచ్చా
అన్నము ఇతర ఆహార పదార్ధాలను విక్రయించడం మహా పాపం అని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. అందుకే అన్నము దానము మాత్రమే చేయాలి కానీ అమ్మకూడదు, జీవించటానికి హోటళ్లు లాంటివి నడుపుకోవటాన్ని ఇప్పుడు తప్పుగా పరిగణించలేం, కాలమాన పరిస్థితుల్లో కొన్ని విషయాలు అప్రధానంగా భావించాలి.
అన్నదాన మహిమ చెప్పే కథ
పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు కాశీ యాత్రకు బయలుదేరాడు. ఆరోజుల్లో ప్రయాణ సాధనాలు, సరైన రహదారి వ్యవస్థ ఇంతగా లేనందున కాశీ చేరడానికి వారున్న ప్రాంతాలను బట్టి కొన్ని నెలలు ప్రయాణించాల్సి వచ్చేది. యాత్రికులు మధ్యలో గ్రామాల్లో రాత్రుళ్లు బస చేస్తూ వెళ్లేవారు.అప్పట్లో కాశీకి వెళ్తే కాటికి వెళ్లినట్టే అనేవారు, ఎందుకంటే అసౌకర్యాల కారణంగా వెళ్లిన తిరిగి రావడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి, అలాంటి పరిస్థితుల్లో ఒక బ్రాహ్మణుడు కాశీ యాత్రకు బయలుదేరాడు,అయితే ఈ బ్రాహ్మణుడు ఏదో ఆలస్యం కారణంగా చీకటి పడే సమయానికి తాను వెళ్లవలసిన గ్రామానికి చేరుకోలేకపోయాడు. చీకటి పడింది. బస చేయటానికి ఏ అవకాశం ఉందా అని ఆలోచిస్తే ఏమి చేయాలో అతనికి తోచలేదు. అయితే ఆ నిర్జన ప్రదేశం లో అదృష్టవశాత్తు ఒక కోయవాని ఇల్లు కనబడింది. వెంటనే బ్రాహ్మణుడు అక్కడకు వెళ్లి ఆశ్రయం కోరాడు. శంబరుడు అనే ఆ కోయవాడు ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకొని తన వద్ద ఉన్న వెదురు బియ్యం, తేనె తినడానికి ఇచ్చాడు. తన కుటీరం చిన్నదైనందున దానిలో పడుకోమని, తాను బయట కాపలాగా ఉంటానన్నాడు. కానీ ఆరోజు అర్ధరాత్రి ఒక పులి అతనిపై అదను చూసి దాడిచేసి, చంపివేసి, దేహాన్ని తీసుకుపోయింది.తెల్లవారి ఇదిచూసిన బ్రాహ్మణుడు బిక్కచచ్చిపోయాడు. కోయవాని మరణానికి చింతించి, తన దారిన తాను వెళ్లాడు. కాశీ చేరాడు. దైవదర్శనం చేసుకున్నాడు.
ఈ బ్రాహ్మణునికి ఎప్పటినుంచో అన్నదానం గొప్పతనం తెలుసుకోవాలనే కోరిక ఉండేది. తన ఇష్టదైవమైన విశ్వేశ్వరుడు ఆ సందేహం తీరిస్తే బావుండునని అనుకున్నాడు. ఆరోజు రాత్రి విశ్వేశ్వరుడు అతనికి కలలో కనిపించి, నువ్వు తిరుగు ప్రయాణంలో ఒక రాజ్యం మీదుగా వెడతావు. అక్కడి రాజుకు ఒక పుత్రుడు జన్మించి ఉంటాడు. ఆ శిశువును ఏకాంతంగా ఆశీర్వదించు అని చెప్పాడు. ఎందుకో చెప్పలేదు. బ్రాహ్మణుడు అలాగే చేశాడు. రాజకుమారుణ్ణి ఏకాంతంగా ఆశీర్వదించేందుకు వెళ్లాడు. చంటి పిల్లవాడైన ఆ రాజకుమారుడు, ఈ బ్రాహ్మణుణ్ణి చూసి నవ్వి, ఓయీ బ్రాహ్మణా! నన్ను గుర్తుపట్టావా, నేను కోయవాణ్ణి. శంబరుణ్ణి. నీకు ఒక్క రాత్రి అన్నదానం చేయడం వల్ల ఈ జన్మలో నాకు రాజయోగం సిద్ధించింది అన్నాడు. మరుక్షణం అతనికి మళ్లీ పూర్వజన్మ జ్ఞానం నశించి మామూలు శిశువుల మాదిరి ఆడుకోవడం మొదలెట్టాడు. బ్రాహ్మణుని సంశయం తీరింది.
ఈ కథ సంగతి ఎలా ఉన్నా అన్నదాన మహిమ ఎంతటి గొప్పదో ఈ కథ చెబుతుంది.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి