అలా ఉండొద్దని అనడం లేదు!;-- యామిజాల జగదీశ్
 ఈరోజుల్లో తప్పక గుర్తుంచుకో వలసిన  విషయం ఒకటుంది.
కొందరు అన్యాయంపట్ల కరుణ చూపడం. జాలిపడి ఆదుకోవడం. అనంతరం మాట పడటం....
మనం ఏ ఊరుకి వెళ్ళినా అక్కడ బతికి చెడిన వ్యక్తంటూ ఒకడు కచ్చితంగా ఉంటాడు.
సంపద బోలెడంత ఉండి ఉంటుంది.
అడిగినవారికీ ఆడగనివారికీ అనే తేడా లేకుండా తన వంతు సాయం చేసి ఉండొచ్చు. దానాలతో పుణ్యం మూటకట్టుకున్న ఆ మనిషి స్థితి ఓరోజు దారుణంగా మారిపోవచ్చు.
గొప్ప దాత అని నలుగురితో అనిపించుకున్న ఆ వ్యక్తి స్థితి దారుణంగా ఉండవచ్చు.
ఆ మనిషి వద్ద సాయం పొందడానికి వచ్చిన వారో, సాయం పొందిన వారో తీరా ఆ వ్యక్తి స్థితిగతులు తెలిసినా ఆదుకోవడానికి ముందుకు రారు. 
ఓ విషయం బాగా తెలిసొస్తుంది. 
ఒకరెంత మంచివారిగా ఉన్నారో ఆ మనిషినే ఈ సమాజం పిచ్చిమాలోకంగా చూస్తుంది. చెవులు కొరుక్కుంటుంది. అతను మంచి మనిషే. కనుక అతను మంచిగా బతకాలని అనుకోదీ లోకం. అతని దగ్గర వీలైన మేరకు దోచుకోవాలనే అనుకుంటుంది. 
అతను మంచిగా బతికున్న రోజులలో మేము మీకు రుణపడి ఉన్నామండీ..ఎలా రుణం తీర్చుకోవాలో తెలీడం లేదండీ అని ఆ సమయానికి ఏవేవో మాటలంటారు. కానీ ఆ మాటలేవీ తర్వాతికాలంలో జ్ఞాపకానికి రావు. ఒకవేళ జ్ఞాపకమున్నా మిన్నకుండి పోతారు. అందుకే అటువంటి మాటలకు ఉప్పొంగిపోకూడదు.
ఓ మంచి మనిషి సాయం పొందడం కోసం ఓ నాలుగు మాటలు చెప్తారు. అవేవీ ఆచరణలో కనిపించవు. సాయం పొందాక వారి వంక కన్నెత్తిచూడరు. చెత్తాచెదారాన్ని పారేసినట్టు విసిరికాడతారు. వ్యంగ్యంగా చెప్పుకుంటారు.
అలాగని మంచివారనే వారొక్కరూ లేరనడానికి వీల్లేదు. ఉంటారు, కానీ ఆ సంఖ్యను వేళ్ళమీద లెక్కించొచ్చు. పొందిన సాయాన్ని మరవని వారుంటారు ఒకరిద్దరు.
మంచివారిగా ఉండమని అనడం లేదు.
కరుణాసాగరుడై ఉండొద్దనడం లేదు. కానీ ఎవరితో ఎప్పుడెలా ఉండాలో తెలిసుండాలి.
అది చాలా చాలా ముఖ్యం. 

కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం