గీతా తత్త్వం (6);- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఇక చివరి ఆరు అధ్యాయాలలో భక్తి మార్గాన్ని గురించి మనకు వివరించారు. భక్తి అంటే మనకు తెలిసినది  దేవునిదో దేవతదో విగ్రహాన్ని పెట్టుకొని  పూలు పళ్ళు తెచ్చిపెట్టి పసుపు కుంకుమలతో అలంకరించడమని దాని అర్థం అది కాదు  ఏ పని నీవు చేయదలుచుకొని దానిని ఆలోచించి మంచిది నలుగురికి సహకారిగా ఉంటుంది అని తల పెట్టావో  దానిని నమ్మి  అంకితభావంతో దాని మీదే  శ్రద్ధ ఉంచి చేయి అన్నది గీతా సిద్ధాంతం  మానవ శరీరంలో ఉన్న గీత వెన్నుపూస  అది ఆలోచనలకుమూలం ఒకే విషయాన్ని అనేక రకాలుగా ఆలోచించి జీవుని గందరగోళ స్థితిలో పెడుతుంది  కనుక దానిని అధీనములో గనక ఉంచినట్లయితే నీవు ఏది చేయదలుచుకున్నావో అది చేసి నీవు ఏ గమ్యానికి చేరాలని మనస్సులో పాటించావో అక్కడకు తప్పకుండా వెళ్లి తీరతావు  అని భౌతిక శాస్త్ర అర్థం.
మానవ జీవితం  చాలా విచిత్రమైనది  శంకరాచార్య చెప్పినట్లుగా  దేవుడు జీవుడు  ప్రత్యేకించి ఇద్దరు లేరు  పంచభూతములతో ఏర్పడిన ఈ శరీరాన్ని  లోపల జీవి నడిపిస్తుంది  అంటే జీవి తనువుతో కూడినది కనుక ఇది జీవితం  ఈ జీవితం  అంటేనే ఎన్నో ఆలోచనలు  ఎన్నో శంకలతో కూడినది  ఒక ఆలోచనకు మరొక ఆలోచనకు సంబంధం ఉండదు  ఒక క్షణంలో మంచి ఆలోచన వస్తుంది మరో  క్షణంలో రెండవ రోజున చోటు చేసుకుంటుంది. ఈ రెంటిలో ఏది  కార్యరూపంలో శోయించాలో  మానవ మేధస్సుకు అగమ్యగోచరంగా ఉంటుంది  ఈ ఆలోచన ధృతరాష్ట్ర మహారాజకు వచ్చింది  నేను ఈ ప్రపంచాన్ని  ధర్మక్షేత్రంగా వెలసేలా  చేద్దామనుకుంటున్నాను  కానీ అది కురుక్షేత్రమైన కూర్చుంది.  ఎందుకు అలా జరుగుతోందో నాకు అర్థం కావడం లేదు  అన్న తపనతో  ఆలోచనపరుడైనా సంజయుని పిలిచి తన బాధ చెప్పుకున్నాడు.
ధృతరాష్ట్రుడు అంటే రాష్ట్రమును ధృతి చెందిన వాడు  చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్న మహానుభావుడు  అలాంటి వాడికి  నియంత అని పేరు పెడతారు  ఏ నియంత కూడా  తనకు సంబంధించిన విషయాలను తప్ప ప్రజలకు అనుకూలంగా ఏ పని చేయడు  ఎవరైనా వ్యతిరేకించినప్పుడు వారి తరలి తీయడమే అతని పని  కనుక ఆ రాజ్యంలో  క్షేమం సంక్షేమం ఉండే ఆస్కారమే లేదు  కనుక బుద్ధిమంతుడు వచ్చి దానిని సరి చేయాలి  సంజయుడు అంటేనే  స  సున్న  జయుడు  సున్నను జయించినవాడు ( ఇదం పూర్ణం అదంపూర్ణం)  ఈశా వాశోపరిషత్తు ఆధారంగా  సున్నను సున్నతో కూడినా తీసివేసినా భాగించినా హెచ్చించినా సున్ననే వస్తుంది తప్ప మరొకటి రాదు. ఆ జ్ఞాన సంపన్నుడు తనకు హితబోధ చేస్తాడని కోరి తనను పిలిపించుకున్నాడు.



కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం