ప్రసాదం-పరమార్ధం.;-డా. బెల్లంకొండ నాగేశ్వరరావు .చెన్నయ్ .9884429899.
 అన్నం పరబ్రహ్మస్వరూపం అని శృతులు చెపుతున్నాయి.ప్రాణంకాపాడేది అన్నంకనుక,అన్నాన్నిప్రసాదంగాచూడమని ఆదిత్యపురాణంచెపుతుంది.
               "పూజితం హ్వశనం నిత్యం బలమూర్జంచ యచ్ఛతి"
పవిత్రజలంతో పరిశుభ్రంగా పవిత్రభావంతో వండిన అన్నం పరబ్రహ్మ స్వరూపంఅవుతుంది. పదిమందికి పంచగా మిగిలిన శేషాన్ని 'అన్నయజ్ఞం'తరువాత భుజింపమని విజ్ఞులు చెపుతారు.దానాల్లోకెల్లా 'అన్నదానం'గొప్పదని పెద్దలు చెపుతారు.
                 'అన్నాన సదృశం దానం నభూతో నభవిష్యతి'
శుధ్ధము,సిద్ధము,ప్రసిధ్ధము అని ప్రసాదాన్ని లాక్షణికులు మూడు విధాలుగా పేర్కొన్నారు.గురుభుక్తశేషాన్ని'శుధ్ధము' దైవభుక్తశేషాన్ని'సిద్ధము' భగవత్ భక్తులు భుజింపగా మిగిలిన శేషాన్ని'ప్రశిధ్ధమని'పెద్దలు అన్నారు.అందుకే' అన్నబ్రహ్మతత్వరాధనకు' భారతీయసంస్కృతి పెద్దపీటవేస్తాయి.
అన్నంబ్రహ్మ"అహంచబ్రహ్మ"భోక్తాంచబ్రహ్మ"అన్నారు పెద్దలు.ప్రసాదమంటే ప్రసన్నత,తేటదనము,నైర్మల్యము, ఈప్రసాదం పంచకుండా తింటే విషతుల్యం అంటారు.
'అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే'
జ్ఞానవైరాగ్య సిధ్యార్థం బిక్షాందేహిచపార్వతీ'
అన్నం నైవేద్యరూపంలో ఒక విశిష్ఠత పరమార్ధంగా గోచరిస్తుంది.అన్నంనిండి నిబిడీకృతమైన శక్తి పాలతో కలసినపుడు, దీనికి తీపిపదార్ధంకలిపితే,ద్విగుణీకృతమౌతుంది.రెట్టింపై 'చక్కెరపొంగలిగా' మారుతుంది.దానికి పెసరపప్పు,కొబ్బరిముక్కలు కలిస్తే వచ్చే పోషకవిలువలు అపారం.అలా నివేదన చేయబడిన 'పిడికెడు'నైవేద్యం ఒ అభాగ్యుని అర్ధఆకలిని తీర్చగలుగుతుంది.అలాగే 'పులిహార''పొంగలి' 'దద్దోజనం'వంటి ప్రసాదాలలో అన్నంకంటే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి కనుకనే వాటిని భగతార్పణం చేసి భుక్తశేషాన్ని మాత్రమే అమృతంగా భావించి స్వీకరించాలి.అందుకే 'ఏకభుక్తం మహాయోగి, ద్విభుక్తం మహాభోగి,త్రిభుక్తంమహారోగి అన్నారు.
ఆకలితొఉన్నవారికి రుచితెలియదుఅని'క్షుథాతురాణంనరుచిఃనచకాలమ్ .ఆకలిగా ఉన్నప్పుడు దొరికిన ఆహారం అమృతతుల్యం.మనిషిమరణించవచ్చుగాని,దానశీలిమరణానంతరము చిరంజీవే.అన్నిదానవలన మనిషి మహనీయుడిగా గుర్తింపబడతాడు.ఈ ఈశ్వరార్పణ భావనకి సత్త్యశుధ్ధికలుగుతుంది.అప్పుడే చిత్తశుధ్ధి,జ్ఞానం,జాలి,దయా,కరుణభావాలు ఏర్పడతాయి.ఈలక్షణాలు కలిగిన మనిషి ఇలలో మహాన్నతుడిగా కొనియాడబడతాడు. 
దానం ఎదైన ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాలకోసం ఇవ్వడం. దానం చేసిన వ్యక్తిని దాత అంటారు. దానం ఇమ్మని అర్ధించేవారిని యాచకులు అంటారు. దానం ఇచ్చేవి ధనం, వస్తువు రూపంలో గాని సేవా రూపంలో గాని ఉంటుంది. దుస్తులు, బొమ్మలు, ఆహార పదార్ధాలు, వాహనాలు, పశువులు.
ఆకలితో ఉన్న వ్యక్తికి పిడికెడు అన్నాన్ని దానం చేసిన వ్యక్తి ధన్యుడు. ముఖ్యంగా కరువు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇవి ఇంకా అవసరం. అలాంటి క్లిష్ట సమయాలలో అన్నదానం చేసిన వ్యక్తిని ప్రజలంతా దేవునితో సమానంగా పూజిస్తారు. కన్యాదానం:వివాహంలో పెళ్ళికూతురు తండ్రి కన్యగా తన కూతుర్ని ఇచ్చే దానం.వరకట్న ప్రభావం వల్ల ఇది కన్యతో పాటు ధన వస్తు కనక వాహన దానంగా కూడా పేరుగాంచింది.
పురాణాలలో దానం.
వైశాఖమాసం - దానాలు ఇవ్వడానికి ప్రశస్తమైన మాసంగా పురాణాలు పేర్కొన్నాయి.
బలి చక్రవర్తి - మూడడుగులు విష్ణుమూర్తికి దానం చేసి చిరస్మరణీయుడైనాడు.
శిబి చక్రవర్తి - పావురం రూపంలో వచ్చిన దేవతలకు తన శరీరాన్ని కోసి దానం ఇచ్చిన ఉత్తముడు.
కర్ణుడు - తనకు సహజంగా ఉన్నకవచకుండలాలను రక్షకకవచాన్ని దానం చేసి "దాన కర్ణుడి"గా నిలిచాడు.
ఏకలవ్యుడు - తన బొటనవేలును కోసి ఇచ్చాడు. 
మానవునికి ఉన్న సుగుణాలలో ఒకటి దానం చేయడం. దానం చేసే వ్యక్తి దానం స్వీకరించే వ్యక్తి దానం స్వీకరించడానికి తగిన పాత్రుడా కాదా అని ఆలోచించి లేదా రుజువు చేసుకొని అతను దాన స్వీకరణకు అర్హుడు అయినట్లయితే అతనికి దానం ఇవ్వాలి.


కామెంట్‌లు