కార్పొరేట్‌ సమాధులు;- డా.రామక‌ కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.

 రెక్కలు తొడుగుతున్న 
పసిమొగ్గలను చిదిమేస్తూ,
చదువు చావులను పరిచయం చేస్తూ,
వ్యాపారమే విద్యకు తార్కాణం చేసేస్తూ,
కార్పొరేట్ నరకాలు అనుభవింజేస్తూ,
సాత్వికమైన బతుకులను అతలాకుతలం గావిస్తూ,
రాక్షస ప్రవృత్తితో అరాచక పనులు జరిపిస్తూ,
భావిపౌరులను బలిచేస్తున్నారు.
విత్తుకుంటున్న మేధో అంకురాలకు,
కార్పొరేట్ సమాధులు కడుతున్నారు.
తల్లిదండ్రులు మేల్కొనకపోతే,
సమాజం ఉద్యమించకపోతే,
నిస్సంతులై నిలబడతారు.
కౌమారం కాంతివిహీనమై,
మెదడు చెదపురుగుల మయమై,
యువత భవిత లేనిదై,
జాతి అభివృద్ధి శూన్యమై
అలమటించక మానదు.
కార్పొరేట్‌ కసాయిలకు కన్నబిడ్డలను అప్పగించకండి.
అంగడిలో బిడ్డలను అమ్మేయకండి.
వివేకమే కవచమై నిలవనీయండి.
గ్రద్ధలకు ఆహారాన్ని ఉచితంగా అందించకండి.
జీవితం కనుమరుగైతే
అంధకారంలో అరణ్యరోదన చేస్తూ జీవచ్ఛవాల్లా బ్రతుకుతారా?
ఇంద్రధనుస్సు బతుకుకు
ప్రాణం పోస్తారా?
కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం