తెలుగు జాతీయం.;- తాటి కోల పద్మావతి గుంటూరు

 అక్కన్న మాదన్నలు:-
ఎడతెగని బంధము గలవారు.
దీనికొక చిన్న ఇతిహాసం కలదు. అక్కన్న మహా మేధావి. గోల్కొండ నవాబు వద్ద మంత్రిగా పనిచేశాడు. ఆ నవాబు వద్ద మాదన్న సేనాపతిగా పనిచేశాడు. ఇతడు మహావీరుడు. వీరిద్దరూ ఒకే రాజు కొలువులో ఉన్నారు. వీరిద్దరి మైత్రి బంధము దృఢముగా ఉండేది. ఒకరిలో ఒకరు ఒదిగి మెదిలేవారు. వారు జీవితాంతం ఆ విధంగానే మైత్రి బంధంలో ఉన్నారు.
అక్కన్న మాదన్నలా బంధము సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడింది. పురాణాలలో కూడా కొన్ని కొన్ని ఇట్టి బంధాలు ఉన్నాయి. కానీ అవి సమాజ శ్రేయస్సుకు పనికిరానివి కాబట్టి ఆ జంటలను జాతీయాలుగా వాడుకోలేదు.
ఎవరైనా ఇద్దరు కలిసి జంట కవుల వలె కనిపిస్తే వారిని అక్కన్న మాదన్నలు అనడం వాడుక లోనికి వచ్చినది.
శ్రీరామ సుగ్రీవులు, కృష్ణ కుచేలులు, వీరి మైత్రి కూడా లోకములో కనిపిస్తుంది కానీ జాతీయాలుగా రూపొందలేదు.
జర సంధ శిశుపాలుడు, కర్ణ దుర్యోధనులు-ఇలాంటివి ఎన్నో కలవు. కానీ అవి జాతీయాలు కాలేదు. ఒక జాతీయం కావటానికి సర్వకాలీన సమాజ శ్రేయము ఆ మాటల్లో నిలిచి ఉండాలి. వాడుకలోనికి వస్తేనే అది జాతీయ మవుతుంది. అక్కన్న మాదన్నలు తెలుగువారు చరిత్ర పురుషులు-తెలుగు వారందరికీ తెలిసిన వారు కాబట్టి వారి జంట జాతీయంగా మారింది.

కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం