ఒకప్పుడు మంచి పవిత్ర భావాలతో శుచి శుభ్రతతో వంట చేసి వడ్డించేవారు.పైగా దైవస్మరణతో చేయటంవల్ల వంటకిరుచి మాత్రమే కాదు తిన్నవారిలో మంచి ఉదాత్త భావాలు అంకురించేవి.
వటవృక్షంకింద బోధిసత్వుడు కూచున్నాడు. ఒక యువతి పంచభక్ష్యపరమాన్నాలతో ఘుమఘుమ లాడే వంటకాలు ఆయన ముందు పెట్టి దర్పం డాబ్సరిగా"తినండి స్వామీ!" అంది."అమ్మా!నాకు ఆకలిగా లేదు. మన్నించు.తీసుకుని వెళ్లు"అనగానే కాస్త మొహం చిట్లించి వెంటనే వెళ్లి పోయింది. కాసేపటికి ఓపల్లెపడుచు తాను తినే ముతక రొట్టె మిర్చి పచ్చడితో వచ్చి వినయంగా "స్వామీ! ఇది స్వీకరించి నన్ను ధన్యురాలిని చేయండి " అని చేతులు జోడించి నిలబడింది. ఆయన ఆప్యాయంగా తిన్నాక వెళ్లి పోయింది. సౌభద్రుడనే శిష్యుడు అడిగాడు "భన్తే!మొదటి ఆమెతో ఆకలిలేదని చెప్పారు. ఈమె తెచ్చిన పచ్చడితో రొట్టె తిన్నారేంటి?""అవును నాయనా!మొదటి ఆమె అహంకారం డాంబికాలు ప్రదర్శించింది. అశ్రద్ధగా వండి వడ్డిస్తే అది విషంతో సమానం!రెండోఆమె భక్తి ప్రేమశ్రద్ధతో వండి తెచ్చింది." చూశారా! ఇతరులకు పెట్టేటప్పుడు ఆనందంగా ఉండాలి. 🌹
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి