జననేత - వై ఎస్ ఆర్ (15)- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఎవరి గురించి ఎలా ఎవరు వ్యతిరేకంగా మాట్లాడిన ఎవరికైనా నచ్చక మాట్లాడిన  ఆయనకు ఇష్టం ఉండదు  అలా మాట్లాడకూడదని మొహం మీదే చెప్పేవారు  నాకు అనిపిస్తుంది ఆయన పుట్టుకలోనే అలాంటి విలువలు ఉన్నాయేమో అని. అందుకే కాపులు ఆయన మాటల్లోనూ విరుగుడు ప్రస్తావన తరచూ వస్తుండేది  నెపమెల్లకుండా అపకారికి ఉపకారం చేయడంలో ఆయనకు సాటి లేరు  తనకు నష్టం కలిగించిన వాళ్ళు వచ్చి సంప్రదించినా వారికి చేతనైన ఒక మంచి చేసేవాడు  ఎన్నడూ వారి వల్ల కలిగిన చెడు గురించి ప్రస్తావించిన ఒప్పించడం వంటివి కూడా ఆయనకు చేతకాదు  తన జీవితంలో నేర్చుకున్న విషయాలు ఎప్పుడూ ఉండేవాడు. కష్టం బాధ ఎప్పుడూ మాతో పంచుకోలేదు సంతోషాన్ని మాత్రం మాతో పంచుకునేవారు దేవుడు ఆయనకు అన్ని క్వాలిటీస్ ఇచ్చారు  ఆయన సహచర్యం ఉన్న నాకు గాని పిల్లలకు కాని కొన్ని లక్షణాలు ఉన్నాయి  అంటారు విజయలక్ష్మి గారు.
నా మనవడిని చూస్తేనే నాకు బాధగా ఉంటుంది  వాడు ఇప్పుడిప్పుడే విషయాలు తెలుసుకునే వయస్సు ఆయన ఉంటే వాడికి ఎన్నో విషయాలు చెప్పడానికి ఉండేవాడు అనిపిస్తుంది. జీవితం పూర్తిగా ఆయనతో ఉండలేకపోయాను అనే బాధ నాకు ఎప్పుడూ ఉంటుంది  ఆయన కంటే ముందు పోలేకపోయేనే అన్న బాధ కూడా నన్ను కలచి వేస్తూ ఉంటుంది  కానీ అక్షరము అక్షరంలో ఆవేదన పడుతున్న నా గుండె కాస్త ధిటవుగా ఉన్నదంటే ఆయన నేర్పన విలువ చేయడానికి ఆలంబన  అంటూ విజయలక్ష్మి గారు  రాష్ట్ర భవిష్యత్తు గురించి  ఆయన చాలా కలలు కంటూ ఉండేవాడు. రాష్ట్ర రూపురేఖలు మారిపోవాలి. జల యజ్ఞం ప్రాజెక్టులు అన్నీ పూర్తయి లక్షల ఎకరాల  అందరికీ అన్ని వసతులు సౌకర్యాలు ఉండాలి అంటూ ఉండేవాడు. అయితే అనుకోని విధంగా ఆయన ప్రస్థానంలో వాటిలో ఇంకా కొన్ని అసంపూర్తిగానే ఉన్నాయి  ఆయన వినియోగం కలిగించే బాధ ఒక వ్యక్తి అయితే ఆయన కలలు నెరవేరలేదని విచారణ మరో ఎత్తు జన హితం పట్ల ఆయనకు కమిట్మెంట్ ఎక్కువ. ప్రాజెక్టుల విషయంలో వేగం కోరుకునేవారు ఎప్పుడు పరుగుగా ఉండేవారు అదే పరుగులు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన  అంటూ కన్నీటితో చెప్పారు విజయలక్ష్మి గారు. జగన్ కు చాలా విషయాలు విశ్లేషించి చెప్తూ ఉండేవారు ఏ పనంటే ఏమిటి దాని వివరాలు ఏమిటి అనే విషయాలు వివరిస్తూ ఉండేవారు. ఆరోజు సెప్టెంబర్ రెండో తేదీ కూడా ప్రకాశం బ్యారేజీ గురించి జగన్ ప్రస్తావిస్తే  ఆయన నేటి ప్రాజెక్టుల గురించి చాలా వివరాలు చెప్పారు రాబోయే మూడు ఏళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తిచేసేయాలి  ప్రాణహిత  చేవెళ్ల కు కూడా అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి అనే తన కోరికను వ్యక్తం చేశారు  నిన్ననే అసెంబ్లీ ముగిసింది  ఇవాళ బాగా వర్షం పడుతోంది రెండు రోజుల తర్వాత ఈ పర్యటన కార్యక్రమాలు ప్రయాణం చేసుకోవచ్చు కదా అని నేను చెప్పాను  కానీ చాలా పనులు పెండింగ్లో పడిపోతున్నాయి అన్ని మిగిలిపోకుండా చూసుకోవాలి కదా వర్షం అది అనుకుంటే ఇబ్బంది అవుతుంది అన్నారు  ఏం కాదులే అంతా వాడు చూసుకుంటాడు లే అని చెప్పి బయలుదేరారు  ఆయన జన్మ సార్థకం ఆయన మహానుభావుడు ఆయన పర్యటనకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలను  అంటారు విజయలక్ష్మి గారు.


కామెంట్‌లు