రెడ్డి రాజులు (19);- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 పారిస్ నుంచి ఇండియా రాగానే ఈమె మద్రాస్ కౌన్సిల్ నెంబర్ కావడం భారత మహిళా సంఘం  ఈమెను ఎన్నిక చేసింది. ప్లే స్టోర్ కౌన్సిల్లో సభ్యతమే కాక సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకున్న డిప్యూటీ ప్రెసిడెంట్ కూడా అయింది ఈమె  1933లో అమెరికా వెళ్లి చికాగోలు అంతర్జాతీయ మహిళా సదస్సులో పాల్గొని  వచ్చింది  1933లో స్త్రీల ఓటు హక్కును గురించి వాంగ్మూలం  ఇవ్వడానికి  ఎన్నుకున్న ముగ్గురు స్త్రీలలో ఈమె ఒకరు 1956 లో ఆమెకు పద్మభూషణ్ లభించింది  అవార్డులు గౌరవ పురస్కారాలు ఆమె పాదాల ముందు వాలాయి. కానీ ఆమె దృష్టి ఎప్పుడూ తోటి మానవుల సౌకర్యం మీదనే  అసలు ఆమె జీవితమే ఒక ఉద్యమం వైద్య విద్యా స్త్రీ శిశు సంక్షేమాల్లో ఆమె సేవ అనన్యం  ఆమె లాంటి మరో స్త్రీ చరిత్రలో మనకు కనిపించడం కష్టం.
భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించడంలో  స్త్రీ పురుష భేదం లేకుండా  ప్రతి ఒక్కరూ ఈ దేశం నాది  ఈ రాష్ట్రం నాది  ఇది నా జన్మ భూమి  దీనిపై అన్ని హక్కులు మాకే ఉండాలి వారికి కాదు  అని ఎంతో ధృఢ సంకల్పంతో పనిచేసి  తమ జీవితాలను సైతం  దేశం కోసం ఆహుతి చేసిన ఎంతోమంది  స్వాతంత్ర్య సమరయోధుల  కష్టఫలాన్ని మనం అనుభవిస్తున్నాం. ఆ విషయాన్ని తెలుసుకొని వారు  చేసిన త్యాగానికి సరిపడిన  పనిని మనం పూర్తిచేసి ఏ ఆశయ సిద్ధి కోసం వారు ప్రాణాలను అర్పించారో దానికి ఆదర్శప్రాయంగా నడవవలసిన  బాధ్యత నేటి యువకుల పై మాటపై ఉన్నది అన్న విషయాన్ని  ప్రతి ఒక్కరూ గమనించినట్లయితే  దేశం రాజకీయంగా  ఆర్చికంగా నైతికంగా  ముందుకు ఉరకలు వేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
మరి కొంతమంది వీరనారీమణుల జీవిత చరిత్ర లను తెలుసుకొనే ముందు  కొన్ని కవితలు వినిపిస్తాను  అవి ఊరికే చదవడం కాకుండా  ఆ కవితలు ఏ భావానికి ఆ పదాలు వాడారో  దానివల్ల పూర్తి భావం వ్యక్తం అయిందా  ఇది నేను రాస్తే ఎలా ఉంటుంది  నాకున్న అభిప్రాయాలను నేను కవితా రూపంలో ఎందుకు వ్రాయకూడదు  అన్న ఆలోచనలను మీలో రేకెత్తించడానికి  ఈ ప్రయత్నం  చదవడం అంటే అక్షరాలను పాటికి పది సార్లు చదివి జ్ఞాపకం ఉంచుకోవడం కాదు  మనకు ఉన్న జ్ఞానాన్ని  అనేక రకాలుగా విస్తృత పరచుకోవడం  అన్ని విషయాలు తెలుసుకోవాలి  తెలుసుకున్న వాటిలో మంచిని ఆచరించాలి  చెడును వదిలివేయాలి  మీరందరూ బుద్ధిమంతులు అని నాకు తెలుసు. జ్ఞాన తృష్ణ  మీలో రగులుతోంది  దానిని దేదీప్యమానం చేయడం కోసమే ఈ ప్రయత్నం మరి కొనసాగిద్దామా.



కామెంట్‌లు