ఆదర్శ వ్యక్తి- రంగారెడ్డి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 గ్రామపంచాయతీలో ఆ గ్రామ అధ్యక్షునిగా ఉండడానికి గాని  రాష్ట్రానికి సంబంధించి దేశానికి సంబంధించి లేదా ప్రపంచానికి సంబంధించి  పరిపాలనకు సంబంధించిన విషయాలను  మనం చెప్పుకోవాలంటే  పరిపాలనా దక్షత కలిగిన వ్యక్తి మన ముందుకు రావాలి. అతని వ్యక్తిత్వం బాగుండాలి  మానసిక వైకల్యం లేకుండా ఉండాలి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు  తన  సహ ఉద్యోగులతో మంత్రులతో సంప్రదించి  దానివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అన్న విషయాన్ని కూలంకషంగా చర్చించి నిర్ణయానికి రావాలి  ఇవన్నీ చేయగలిగిన వారు ఎవడైతే ఉంటారో  వారిని మంచి పరిపాలకుడిగా  ప్రజలు  గౌరవిస్తారు. అలాంటి వ్యక్తులలో  ప్రజల అందరి ప్రశంసలకు పాత్రులైన వారు కొండా వెంకట రంగారెడ్డి గారు  వారి గురించి రెండు విషయాలు తెలుసుకుందాం.
కొండ అన్న శబ్దం ఉన్నత తత్వానికి గాంభీర్యానికి ఆశ్రయానికి స్థిరత్వానికి ప్రతీక  వెంకట రంగారెడ్డి గారి ఇంటి పేరు కొండ  పేరులోనే ఉన్నది పెన్నిధి. పెన్నిధి అంటే పెద్ద న
నిధి దేనికి పెద్దది అంటే వీటికి నిర్వహణకి కర్తవ్యపాలనకి కార్యాచరణకి  ధర్మాచరణకి దాతృత్వానికి దూర దృష్టికి రంగారెడ్డి గారు నీధి వంటి వారు  వాటికి కూడా ప్రతినిధి నిష్కళంక దేశభక్తుడు దిన జనబాంధవుడు తెలంగాణ ప్రజల హృదయాలలో నిలిచిన మహనీయుడు. హోం శాఖామంత్రిగా మద్యనిషేధ శాఖ మంత్రిగా రెవిన్యూ శాఖ మంత్రిగా  ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ దురంధరుడు  రంగారెడ్డి జిల్లా నామకరణానికి కారణభూతుడైన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా గొప్ప పరిపాలనా దక్షత ఘన చరిత్ర కలిగిన  మర్రి చెన్నారెడ్డి గారు మేనమామ. ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్గా సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన కొండా మాధవ రెడ్డి గారి పితృపాదులైన కొర్ల వెంకట రెడ్డి గారు  హైదరాబాద్ సమీపంలో అప్పటి అప్పరావు  జిల్లా పెద్ద మంగళూరు గ్రామంలో నేటి రంగారెడ్డి జిల్లా 1890 డిసెంబర్ 12న మధ్యతరగతి కుటుంబంలో చెన్నారెడ్డి, బుచ్చమ్మ దంపతులకు వారి పుణ్యఫలాల పంటగా జన్మించారు. పుష్పించిన పారిజాత కుసుమమై ఆంధ్రుల అదృష్టంగా రంగారెడ్డి గారు సద్వంశ సంజాతకుడు బహు దొడ్డవాడు. వారి తాత ఎల్లారెడ్డి గారికి ఐదుగురు కుమారులు ఉన్నారు  వీడి తండ్రి చెన్నారెడ్డి గారు వ్యవహార దక్షతతో కొడుకును సత్యమునిగా సద్గుణ సంపన్నునిగా, విద్యావేత్తగా న్యాయవాదిగా  రాజకీయ చతురునిగా తీర్చిదిద్దిటంలో అద్వితీయుడు  రంగారెడ్డి గారికి నారాయణరెడ్డి అనే సోదరుడు ముగ్గురు చెల్లెలు ఉన్నారు.




కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం