ఎవరి పుణ్యం వారిదే;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 సనాతన ధర్మానికి వేమన వ్యతిరేకం అని చాలామంది అనుకుంటారు కానీ ధర్మాన్ని విడిచి వేమన ఎప్పుడూ ఎక్కడా ఎలాంటి విషయాన్ని మన ముందు ఉంచలేదు  మానవునిలో ఉన్న బలహీనతలను ఎత్తిచూపి  వాటిని బలంగా చేసుకున్నట్లయితే  దుర్లక్షణాలు పోయి మంచి లక్షణాలు ఏర్పడతాయి అన్న సదుద్దేశంతో  తన ఆటవెలది పద్యాలను వ్రాయడానికి  ఉపక్రమించాడు  వేల సంఖ్యలో మనకు అందించిన పద్యాలను ఒక్కసారి మననం చేసుకున్నట్లయితే  ఎవరు ఏ పని ఎలా చేయాలి  ఎవరి పని వారు చేయాలి తప్ప మరొకరి పైకి నెట్టకూడదు  పరాయి అధికారాలను తనపై వేసుకుని  చలాయించినవాడు ఎవడూ  సుఖమైన జీవితాన్ని గడప లేడు  అన్న విషయాలను కూలంకషంగా చెప్పగలిగిన మేధావి వేమన. ఉమ్మడి కుటుంబాలలో ఆ కుటుంబ పెద్ద ఏది చెపితే మిగిలిన అందరూ కూడా ఆ పనిని తప్పకుండా అమలు చేస్తారు  వాడు చెప్తే నేను చేసేది ఏమిటి  నాకన్నా కొంచెం ముందు పుట్టినంత మాత్రం చేత  నాపై అధికారం చేలాయించడానికి అతను ఎవరు అన్న దృష్టి  ఆ రోజుల్లో ఎవరికి ఉండేది కాదు  తల్లిదండ్రులను దేవతా స్వరూపులుగా ఎంచి  పెద్ద ఏది చెబితే దానిని తూచా తప్పకుండా  చేసి చూపించడం  వారి విధ్యుక్త ధర్మంగా  భావించారు తప్ప అదేదో వెట్టి చాకిరి అన్న దృష్టితో కాదు  పెద్దలకు తెలియకుండా దానధర్మాలు చేయడానికి కూడా వీరు అంగీకరించరు  ఏ పని చేసినా పెద్దలకు తెలిసేలా వారికి చెప్పి వారు చేయమంటేనే దానిని చేస్తారు తప్ప సొంత అభిప్రాయాలతో వారు ఏర్పాటు చేసుకోరు.
ఇంటి పెద్ద చెప్పిన పనిని చేస్తే ఆ పనికి  ప్రతిఫలంగా వచ్చే పుణ్యం ఆయనకే దక్కుతుంది  అది నాకు దక్కదు అన్న భేద అభిప్రాయాన్ని  వారు ఎప్పుడూ వ్యక్తపరచలేదు  ఉమ్మడి కుటుంబం కదా ఏది చేసినా అందరికీ సమానంగానే వస్తుంది అన్న అభిప్రాయం తప్ప వేరే ఏమీ లేదు  కానీ వేమన చెప్పే నీతి వేరుగా ఉంది  అన్న చేసిన పనికి ఫలితం తమ్ముడు కి రమ్మంటే ఎలా వస్తుంది. రాదు కదా. తన కాలు కోసుకున్నాడు అనుకుందాం  ఆ కాలిబాధ తనకు తెలుస్తుందా తన అన్నకు తెలుస్తుందా  కనుక ఎవరు చేసిన మంచి పనికి వారికే ఆ పుణ్యం దక్కుతుంది తప్ప మిగిలిన వారికి కాదు అని  చాలా స్పష్టంగా చెప్పాడు వేమన  ఆ వేమన  రాసిన పద్యం చదివితే  ఆ విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది  ఒకసారి ఆ పద్యాన్ని చదవండి.
తనదు భ్రాతలెల్ల దానంబు చేయగా తనకు ఫలమటంచు దలచరాదు 
తనదు కాలుగోయ తన తమ్ముడేడ్చునా...."

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం