రాయలసీమ శతాబ్దాల నుంచి కరువు కాటకాలకు గురికావడానికి కారణం ప్రకృతి పరంగా ఇక్కడ సహజ నీటి వనరుల పారుదల సౌకర్యాలు సరిగా లేకపోవడం ఉన్న వాటిని సక్రమంగా వినియోగించుకోలేకపోవడం భౌగోళిక వాతావరణం లో అనేక మార్పులు రావడం కరువు తీవ్ర తను గుర్తించే విజయనగర రాజులు రాయలసీమ వ్యాప్తంగా దాదాపు 5 వేలకు పైగా చెరువులు త్రవ్వించాడు అందుకే విజయనగర రాజుల కాలంలో ఈ సీమ రాళ్ల సీమ గాక కోనసీమలా సస్యశ్యామలంగా ఉంది రతనాల సీమగా పేరు తెచ్చుకుంది. విజయనగర సామ్రాజ్య విచ్ఛిన్నత తరువాత పరిపాలనకు వచ్చిన రాజులు వారి రాజకీయ అధికారాన్ని నేర్పుకోవడంలోనే ఎక్కువ దృష్టి సారిచాడే తప్ప నేటి పారుదల గురించి ప్రజా అవసరాల గురించి పెద్దగా పట్టించుకోలేదు. రాజే అరసత్వం చూపిస్తే అతనికి జాగ్రత్తలు పాలిగాడు ఎవరు ప్రజానీకం గురించి పట్టించుకుంటారు వ్యక్తిగత శ్రద్ధ వల్ల బావుల నిర్మాణం చెరువుల నిర్మాణం అక్కడక్కడ కొంతమంది జాగ్రిదారులు చేపట్టిన అది కొద్ది శాతం మాత్రమే. దత్త మండలాలుగా పిలువబడే రాయలసీమలో సార్ థామస్ మన్రో రైతు వారి విధానాన్ని ప్రవేశపెట్టాడు భూ విభజన జరిగింది జాగిరిదారుల చేతుల్లోంచి రైతుల చేతుల్లోకి వచ్చింది సొంత ఆస్తిగా భూపత్రాలు రూపొందించబడి రైతుల చేతికందినాయి ఇది సంతోషమే సంస్కరణల పేర ప్రజలు దోపిడీకి గురి కావడం తప్ప వారికి వేరే మార్గం లేకపోయింది బ్రిటిష్ వారికి బాగా తెలుసు భూమిని విభజన చేసి ఎకరానికి ఎంత చొప్పున శిస్తు. ఆ శిస్తును వసూలు చేసేందుకు కారణాలను గ్రామోద్యోగుల్ని నియమించి దండుకోవడం (దౌర్జన్యంగా వసూలు చేయడం) ప్రారంభించారు అయితే శిష్యులు చూడడంలో చూపించిన ఆత్రం సేద్యపు నీతి వసతులు కల్పించడంతో బ్రిటిష్ ప్రభుత్వం చూపించలేదు ప్రజలు అధికారులు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం వాటిని తోసిరాజనిశిస్తూ వసూడికే ప్రాధాన్యమిచ్చింది ఫలితం 15వ శతాబ్దంలో నిర్మించిన చెరువులు పూడుబడ్డాయి కొన్ని కట్టలు దగ్గర ధ్వంసం అయినాయి. వాటి పునః నిర్మాణం కానీ కూడికలు తీయడం కానీ ఈ ప్రాంతంలో నిర్మించే ప్రయత్నం గాని జరగలేదు అంతా దైవాధ్యానపు పంటలనే రైతులను నమ్ముకోవాల్సి వచ్చింది.
దానశీలి- బుడ్డా వేంగళ రెడ్డి (23);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి