సాగరతీరం....
పిండ ప్రదానం....
పితృ పితామహాది వంశ మూల పురుషుల ఆత్మలకు
సద్గతి ప్రాప్త్యర్ధం....,
చేసే మహత్తర కార్యం !!
నదీనాం సాగర గచ్చతి...,
ఆత్మలన్నీ పరమాత్మలో ఐక్యం కావలసిందే... !
నది ప్రవహించిన ప్రాంతాలనన్నిటినీ... సస్య శ్యామలం చేస్తూ... దాహార్తిని తీరుస్తూ... చివరికి తన జన్మస్థానమైన సాగరాన్ని చేరుకున్నట్టే.....,
ఈ మనిషికూడా...
తను బ్రతికి ఉన్నంత వరకూ
చుట్టూవున్న పశుపక్ష్యాది ప్రకృతితో సహా...
తోటి మనుషులందరితోనూ స్నేహంగామెలగుతూ...
చేతనైన మేలునే చేస్తూ...
తమ నిజస్థానమైన ఆ పరమాత్మలో కలిసిపోయినపుడే ఈ జన్మకు సార్ధకత... !
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి