మన భాష;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం, నెల్లూరు.6302811961.
 మాతృమూర్తిని, మాతృదేశాన్ని  మరచిన వారికి మానవత్వమే ఉండదు అని మన పెద్దలు చెప్పిన మాట.  భాష  ఒకరి అభిప్రాయాలను మరొకరికి తెలియజేయడానికి  ఉపయోగించేది మాత్రమే  అది గ్రంథస్తం చేసినప్పుడు  శాశ్వతంగా ఉంటుంది  అసలు మన మాతృ భాష ఏది  తెనుగు, తెలుగు, ఆంధ్రము  త్రినగ దేశము. మూడు పర్వతముల మధ్య ఉన్న దేశంగా  అది మాతృమూర్తి  పార్వతి దేవిగా చెబుతారు  దీనిని  తెనుగు అని వివరించారు. దీనికి 36 అక్షరాలు ఉంటాయి  19 మెట్లు ఎక్కి పర్వతంపై ఉన్న శివుని దర్శనం చేయడానికి వెళ్లి  వారి ఆశీస్సులు పొందిన తరువాత  36 అక్షరాలకు సంస్కృతంలో ఉన్న 19 అక్షరాలను  అప్పు తెచ్చుకొని 55 అక్షరాలతో  తెలుగు భాష ఏర్పడింది.
మూడు పర్వతాల పైన ఉన్న మూడు శివలింగాలకు సంబంధించిన  పదంగా త్రి లింగ శబ్దాన్ని  ఆధారం చేసుకుని తెలుగు అన్న  పదం ఆవిర్భవించింది  భూమికి పార్వతీ దేవి ఆకాశానికి శివుడు  అయితే  భూమిని ఆకాశాన్ని కలిపే ఏకైక వ్యక్తి గణనాథుడ.  ప్రాకుతం నుంచి తెచ్చుకున్న ఒక్క అక్షరంతో 56 అక్షరాలను  పరిపూర్ణమైన పరిణతి చెందిన  అద్భుతమైన భాషగా ఆంధ్రభాష  ప్రస్తుతం మనం మాట్లాడుతున్నాం  దీనిని వదిలేసి బిడ్డలు వాడడం ఎంతవరకు సమంజసం  రాజశేఖర్ రెడ్డి గారు అన్నట్లు కని, పెంచి, నిన్ను వ్యక్తిగా తీర్చిదిద్దిన అమ్మను వదిలి  పిన్నికి చీర పెట్టినట్లుగా ఉన్నది  ఈ వ్యవహారం  ఆంధ్ర భాషలో ఉన్న ప్రతి అక్షరానికి అ నుంచి క్ష వరకు  నాలుక చివర నుంచి పుస్ట భాగం వరకు  ఒక్కొక్క అక్షరం పలికే స్థానంగా  చెబుతారు సాహితీవేత్తలు. ఇతర భాషలలో ఎన్ని లుప్తములు ఉంటే (ఉన్న అక్షరాలను పలకక పోవడం)  అంత అందంగా ఉంటుందని వాడు చెప్పుకుంటారు  మన ఆంధ్ర భాషలో ఎంత స్పష్టంగా ప్రతి అక్షరాన్ని దీర్ఘాన్ని దీర్ఘంగా హ్రాస్వాన్ని హ్రరస్వంగా  పలకగలిగితేనే కానీ  పూర్తి అర్థం వ్యక్తం కాదు సున్నా అరసున్న  విసర్గలను కూడా  మన వారు ఎంతో చాక చాక్యంగా వాడారు అన్నది తెలిస్తే  భాష కోసం వారు ఎంత తపన పడ్డారో మనకు అర్థమవుతుంది  గిడుగు రామ్మూర్తి పంతులుగారు  గురజాడ అప్పారావు గారు  కందుకూరి వీరేశలింగం పంతులుగారు లాంటి  వారు సమాజానికి ఎదురు  నిలిచి భాష  పురోగతికి ఎంతో కృషి చేశారు  వారి జీవితకాలం చేసిన కృషిని  మనం సక్రమంగా వాడుకొని  భాషకు ఎలాంటి కళంకం లేకుండా  వాడితే వారి జీవితం సఫలం అవుతుంది (ఆంధ్ర భాషా దినోత్సవ సందర్భంగా). 


కామెంట్‌లు