న్యాయాలు -234
వట బీజ న్యాయము
******
వట బీజము అంటే మఱ్ఱి విత్తనము.
విస్తారంగా , శాఖోపశాఖలుగా విస్తరించే వట వృక్షము/ మఱ్ఱి చెట్టు యొక్క విత్తనము అతి చిన్నగా ఉంటుంది అని అర్థం.
సృష్టిలో కొన్నింటిని చూస్తుంటే చూస్తుంటే తార్కికతకు అందని తాత్వికత కనిపిస్తుంది. ఆశ్చర్యం కలుగుతుంది ఎవరికైనా.ఆవగింజంత మఱ్ఱి విత్తనములోంచి అనంతంగా, శాఖోపశాఖలుగా, ఊడలు ఊడలుగా విస్తరించే మర్రి చెట్టు ఓ అద్భుతంగా కనిపిస్తుంది.
అయితే దీనిని , దీని లక్షణాలను ప్రజాకవి వేమన గారు మానవీయ స్వభావానికి ఎలా అన్వయించి చెప్పారో ఈ పద్యంలో చూద్దాము
"చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు/ కొంచమైన నదియు కొదువ గాదు/ విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత/ విశ్వధాభిరామ వినురవేమ!"
అంటే మనం చేసే మంచి పని ఎంత చిన్నదైనా మనసు పెట్టి అంటే మనస్ఫూర్తిగా చేస్తే అది తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తుంది.ఎన్నో ఊడలతో విశాలంగా విస్తరిస్తూ పెరిగే మర్రి చెట్టు విత్తనం ఎంతో చిన్నదిగానే ఉంటుంది కదా! అంటూ మనిషిలోని మానవతా కోణాన్ని ఆవిష్కరిస్తారు.
దీనినే మరో కోణంలో చూపిన భాస్కర శతక పద్యాన్ని చూద్దామా...!
"పట్టుచు దండ్రి యత్యథమవర్తడైనను గాని వానికిం/ బుట్టిన పుత్రకుండు తన పుణ్య వశంబున దొడ్డ ధన్యుడౌ/ నెట్లన మఱ్ఱివిత్తు మును పెంతయు గొంచెము దాన బుట్టునా/ చెట్టు మహోన్నతత్వమును జెందదె శాఖల నుండి భాస్కరా!"
తండ్రి ఎంతటి సామాన్యుడైననూ తాను చేసుకున్న పుణ్యము వల్ల కుమారుడు గొప్పవాడైతే తండ్రికి అంతకంటే అదృష్టం ఇంకేముంది. చిన్న మర్రి విత్తనం నుండి పుట్టిన మొక్క మహా వృక్షమైనట్లు, అలాంటి కుమారుడు శాఖోపశాఖలుగా విస్తరించి తనకు తన కుటుంబానికి,వంశానికి మహోన్నతమైన పేరు తీసుకుని వస్తాడు అని అర్థము.
ఇలా మఱ్ఱి విత్తనం లాంటి ఓ మంచి పని, సుగుణ వంతులైన సంతానం కలిగితే వారి వల్ల తమ కీర్తి ప్రతిష్టలు వట వృక్షములా వ్యాపిస్తాయనే అర్థంతో ఈ "వట బీజ న్యాయము"ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
"సదాశయము,సత్సంతానము ఎంత గొప్పవో మనకు తెలిసింది కదా.అలా సదాశయం కలిగి వుందాం. సంతానాన్ని మంచి వారిగా తీర్చిదిద్దుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
వట బీజ న్యాయము
******
వట బీజము అంటే మఱ్ఱి విత్తనము.
విస్తారంగా , శాఖోపశాఖలుగా విస్తరించే వట వృక్షము/ మఱ్ఱి చెట్టు యొక్క విత్తనము అతి చిన్నగా ఉంటుంది అని అర్థం.
సృష్టిలో కొన్నింటిని చూస్తుంటే చూస్తుంటే తార్కికతకు అందని తాత్వికత కనిపిస్తుంది. ఆశ్చర్యం కలుగుతుంది ఎవరికైనా.ఆవగింజంత మఱ్ఱి విత్తనములోంచి అనంతంగా, శాఖోపశాఖలుగా, ఊడలు ఊడలుగా విస్తరించే మర్రి చెట్టు ఓ అద్భుతంగా కనిపిస్తుంది.
అయితే దీనిని , దీని లక్షణాలను ప్రజాకవి వేమన గారు మానవీయ స్వభావానికి ఎలా అన్వయించి చెప్పారో ఈ పద్యంలో చూద్దాము
"చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు/ కొంచమైన నదియు కొదువ గాదు/ విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత/ విశ్వధాభిరామ వినురవేమ!"
అంటే మనం చేసే మంచి పని ఎంత చిన్నదైనా మనసు పెట్టి అంటే మనస్ఫూర్తిగా చేస్తే అది తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తుంది.ఎన్నో ఊడలతో విశాలంగా విస్తరిస్తూ పెరిగే మర్రి చెట్టు విత్తనం ఎంతో చిన్నదిగానే ఉంటుంది కదా! అంటూ మనిషిలోని మానవతా కోణాన్ని ఆవిష్కరిస్తారు.
దీనినే మరో కోణంలో చూపిన భాస్కర శతక పద్యాన్ని చూద్దామా...!
"పట్టుచు దండ్రి యత్యథమవర్తడైనను గాని వానికిం/ బుట్టిన పుత్రకుండు తన పుణ్య వశంబున దొడ్డ ధన్యుడౌ/ నెట్లన మఱ్ఱివిత్తు మును పెంతయు గొంచెము దాన బుట్టునా/ చెట్టు మహోన్నతత్వమును జెందదె శాఖల నుండి భాస్కరా!"
తండ్రి ఎంతటి సామాన్యుడైననూ తాను చేసుకున్న పుణ్యము వల్ల కుమారుడు గొప్పవాడైతే తండ్రికి అంతకంటే అదృష్టం ఇంకేముంది. చిన్న మర్రి విత్తనం నుండి పుట్టిన మొక్క మహా వృక్షమైనట్లు, అలాంటి కుమారుడు శాఖోపశాఖలుగా విస్తరించి తనకు తన కుటుంబానికి,వంశానికి మహోన్నతమైన పేరు తీసుకుని వస్తాడు అని అర్థము.
ఇలా మఱ్ఱి విత్తనం లాంటి ఓ మంచి పని, సుగుణ వంతులైన సంతానం కలిగితే వారి వల్ల తమ కీర్తి ప్రతిష్టలు వట వృక్షములా వ్యాపిస్తాయనే అర్థంతో ఈ "వట బీజ న్యాయము"ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
"సదాశయము,సత్సంతానము ఎంత గొప్పవో మనకు తెలిసింది కదా.అలా సదాశయం కలిగి వుందాం. సంతానాన్ని మంచి వారిగా తీర్చిదిద్దుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి