తాండూరు గ్రీన్ ఇండియా చాలెంజ్ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కొట్రి క విజయలక్ష్మి
తాండూరులో
మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల బాలుర యాలాల పాఠశాలలో
తెలుగు భాష దినోత్సవం aug 29
జాతీయ స్పోర్ట్స్ డే పురస్కరించుకొని
గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రోగ్రామ్
ఆధ్వర్యంలో 29 మొక్కలు నాటిన ఉపాధ్యాయులు విద్యార్థులు
ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్
గ్రీన్ ఇండియా చాలెంజ్ పిలుపుమేరకు
తాండూరు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్
కొట్రిక విజయలక్ష్మి
పీపుల్స్ డిగ్రీ కళాశాల
రిటైర్డ్ ప్రిన్సిపల్ వరలక్ష్మి మేడం
ప్రోగ్రాం కన్వీనర్ కె వి ఎం వెంకట్
ప్రిన్సిపల్ స్వప్న ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి ఆగస్టు 29 దినాన్ని పురస్కరించుకొని
పాఠశాల ఆవరణంలో 29 మొక్కలు నాటి గ్రీన్ చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో
పీపుల్స్ డిగ్రీ కళాశాల
రిటైర్డ్ ప్రిన్సిపల్ వరలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ
పర్యావరణ పరిరక్షణ కోసం
ప్రతి ఒక్కరు గ్రీన్ చాలెంజ్ తీసుకొని మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు
ఈ కార్యక్రమాన్ని గ్రీన్ ఇండియా స్ఫూర్తితో తాండూరులో
ఛాలెంజ్ తీసుకున్న విజయలక్ష్మి నీ అభినందించారు.
అమ్మ భాష తెలుగు
పై మమకారం పెంచుకోవాలన్నారు
ప్రతి పనిని ఏకాగ్రతతో
విద్యార్థులు ఉపాధ్యాయులు పనిచేసే అలవాటు నేర్చుకోవాలి . నేటి సమాజంలో విద్యార్థులు ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నా నేపథ్యంలో జీవితము మళ్ళీ మళ్ళీ రాదు దానిని అందరూ స్వార్థకత చేసుకోవాలన్నారు. మొక్కను ఆదర్శంగా తీసుకొని ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని జీవితంలో పైకి ఎదగాలన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ చాలెంజ్ లో భాగంగా తాండూరు మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల బాలుర పాఠశాలలో ఆగస్టు 29 సందర్భంగా29 మొక్కలు నాటి వాటికి సంరక్షణ పై విద్యార్థులకు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కను దత్తత తీసుకొని కాలుష్యం నియంత్రణ ప్లాస్టిక్ నివారణపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు
భవిష్యత్తులో మరిన్ని అవగాహన సదస్సులు నిర్మించబోతున్నట్లు తెలిపారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆరవ వసంతంలోనికి అడుగు పెడుతున్న నేపథ్యంలో
మొక్కలు నాటడంతో పచ్చదనం పెరిగిందన్నారు
కవయిత్రి మొల్ల కళావేదిక ఫౌండర్ అధ్యక్షులు
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రోగ్రామ్ కన్వీనర్
KVM వెంకట్ పాల్గొని మాట్లాడుతూ
బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు మూడు మొక్కలతో ప్రారంభమైన గ్రీన్ చాలెంజ్ దేశం మొత్తంలో లక్షల మొక్కలు నాటడం జరిగిందని నోబుల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి
అమితాబ్ బచ్చన్. అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్
లాంటి సెలబ్రిటీలు కూడా
గ్రీన్ చాలెంజ్ తీసుకొని మొక్కలు నాటడంతో లిమ్కా బుక్ లో రికార్డు సంపాదించుకుంది
భవిష్యత్తులో విద్యార్థులు గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించి తాండూర్ ముందంజలో పెట్టాలని అన్నారు.
తెలుగు భాష దినోత్సవం పురస్కరించుకొని
తెలుగు భాష కోసం కృషి చేసిన
తాండూరు పీపుల్స్ డిగ్రీ కళాశాల మాజీ ప్రిన్సిపల్ వరలక్ష్మి మేడంని ఘనంగా సన్మానించారు
నేషనల్ స్పోర్ట్స్ డే పురస్కరించుకొని
ఎందరో విద్యార్థులకు కానిస్టేబుల్స్ pet
జాబ్స్ వచ్చే విధంగా కృషి చేసిన చైతన్య జూనియర్ కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు రాముని ఘనంగా సన్మానించారు
ఈ కార్యక్రమంలో
ప్రిన్సిపల్ స్వప్న ఉపాధ్యాయులు దేవయ్య. నరేష్ జంగయ్య
కృష్ణవేణి. శ్రీనివాస్ బసంత్ రెడ్డి రామలింగం సంధ్యారాణి గీతారాణి అనిత స్వప్న గీతా బాయ్ చందన జ్యోతి మధు తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి