సర్వేజనా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జూలై మాసంలో నిర్వహించిన "ఆదర్శ వ్యక్తులు" వ్యాసరచన పోటీలో తెలంగాణ ఆదర్శ పాఠశాల -బచ్చన్నపేట,జనగామ జిల్లాలో పదవ తరగతి చదువుతున్న ఎం.అరుణ్ ద్వితీయ బహుమతిగా 300/- రూపాయలు నగదు బహుమతిని పొందడం జరిగింది.ఈరోజు ప్రార్థనా సమావేశంలో ప్రిన్సిపల్ కె.కృష్ణవేణి గారు ,ఉపాధ్యాయ బృందం విద్యార్థికి అందించడం జరిగింది.సర్వేజనా ఫౌండేషన్ ద్వారా చేసే కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది.
విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించడం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న గౌరవ శ్రీ కింతలి సన్యాసిరావు గారికి మా విద్యార్థుల తరుపున,ఉపాధ్యాయుల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు.
విద్యార్థులకు నగదు బహుమతి
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి