సూర్యాపేటలో 'మొలక' ఆవిష్కరణ ; -శ్రీధర్ అక్కినేని
 సూర్యాపేట వాస్తవ్యులు, ప్రఖ్యాత సర్జన్ దివంగత డా. మర్రి లక్ష్మారెడ్డి కుమారుడు డాక్టర్ మర్రి రాజేందర్ రెడ్డి ( FRCS - లండన్ ) నిత్య సాహిత్యాభిలాషి.బాలల స్థాయి నుండి మన తెలుగు సంస్కృతి, సాహిత్యాలను ప్రోదిచేసే క్రమములో హైదరాబాద్ కేంద్రంగా వెలువడుతున్న ' మొలక ' బాలల పత్రికకు చీఫ్ అడ్వైజర్ గా వ్యవహరిస్తున్నారు.
సూర్యాపేట జిల్లాలోని 30 ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలకు  ' మొలక ' బాలల పత్రికను  సంవత్సరకాలం చందా  చెల్లించడానికి తమ  కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారని    డా.రాజేందర్ రెడ్డి తెలిపారు.
జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలకు ఆగస్టు నెలకి సంబంధించిన సంచిక  300 కాపీలను ఉచితంగా అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా డీఈఓ కె.అశోక్ గారు మాట్లాడుతూ ఈ ' మొలక ' సంచికలో నీతి కథలు, పురాణాలు, ఇతిహాసాలు,
దేశభక్తి కథలు, పిల్లల విజయాలు,విజ్ఞాన విశేషాలు, లలిత కళల గురించి చాలా చక్కని విషయాలను విశదీకరించారని దీని  ద్వారా పిల్లలలో భాషా వికాసము, నైతిక విలువలు , విజ్ఞానం పెంపొందుతాయని పేర్కొన్నారు.
వివిధ పాఠశాలలకు  దీన్ని అందజేసిన డాక్టర్ మర్రి రాజేందర్ రెడ్డి గారికి డిఈ వో  కె.అశోక్ గారు  అభినందనలు తెలియజేయడం జరిగింది. 
బాలల సాహిత్యంలో నాలుగు దశాబ్దాల విశిష్ఠ పాత్రికేయులు తిరునగరి వేదాంతసూరి సంపాదక 
నేతృత్వంలో వెలువడుతున్న ఈ ' మొలక ' ఈ ఆగస్ట్ నెల సంచికలో తెలంగాణా ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రచురించడం జరిగింది.
ఈ ఆగస్ట్ నెల ' మొలక '  ఆవిష్కరణ కార్యక్రమంలో సెక్టోరియల్ ఆఫీసర్స్ దేవరశెట్టి జనార్ధన్, శ్రావణ కుమార్, PRTU జిల్లా ప్రధాన కార్యదర్శి సి.హెచ్. రామలింగారెడ్డి, ఉపాధ్యా యులు పల్లి వీరారెడ్డి,   హైదరాబాద్ నుండి వచ్చిన డా. మర్రి రాజేందర్ రెడ్డి, ' మొలక  '  న్యూస్ కో- ఆర్డినేటర్ శ్రీధర్ అక్కినేని తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు