సెప్టెంబర్ 17 విమోచనమో విలీనమో నిరంకుశ పాలనకు సమాధి- శిరందాస్ శ్రీనివాస్హైదరాబాద్-9441673339
సెప్టెంబర్ 17, 1948
నిజాం నిరంకుశ పాలనకు
అంతిమ దినం
నర హంతకులు కిరాతకులు
రజాకార్ల ఆగడాలకు
ఘోరి కట్టిన దినం..
హైదరాబాద్ సంస్థాన ప్రజలకు
దృష్ట పాలన నుండి 
విముక్తి పొందిన దినం..

భాషా, సంస్కృతి 
సంప్రదాయాల అణచివేతకు 
మత మార్పిడులకు
మహిళల మాన ప్రాణాల 
హననానికి పాల్పడ్డ నిజాం
రక్షకులే భక్షకులై దేశాన్ని దోచుకున్న నిర్లజ్జ నిజాం పాలనకు 
పాడే గట్టిన దినం..

రెండు భిన్న ధృవాలు
కమ్యూనిష్టులు, ఆర్యసమాజ్
ప్రముఖ్ లు ఏకమై 
అరాచక పాలనకు 
అడ్డుకట్ట వేసిన దినం..
శతాబ్దాల అసబ్జాయి 
రాచరిక పాలనకు స్వస్తి వాచకం
స్వతంత్ర్య భారతావని పాలనకు
నాంధీ వాచకం

విలీనమో విమోచనమో
భారతావనిలో సమైక్యమో..
రాక్షస పాలనకు ముగింపు
ప్రజాస్వామ్య పాలనకు చాటింపు
కాశీం రజ్వీ ఆగడాలకు చెల్లు చీటీ.
బాంచన్ కాల్మొక్తా ఆన్న
నిజాం నిరంకుశ బానిసత్వపు
సంకెళ్లకు చరమ గీతం.


అపరేషన్ పోలో
వల్లభభాయి రాజనీతి
పోలీసుల కవాతు
భారత సేనల బూట్ల సవ్వడి 
నిరంకుశ నవాబు గుండెల్లో 
రైళ్లు పరిగెత్తించే..
ఎవరికీ తలవంచని నవాబు
వంగి వంగి సలాం చేసిన దినం


సామంతులు జాగిర్థారులు 
గులాములు  ఎందరో 
పలాయనమైన దినం
మువ్వన్నెల జెండా గోల్కొండ పై రెప రెప లాడిన దినం..
హైదరాబాద్ సంస్థానం
భారతంలో విలీనం
నిజాం నిరంకుశ పాలన నుండి
తెలంగాణ, మరట్వాడ బీదర్ ప్రజలకు విమోచనం
స్వతంత్ర భారతంలో ప్రజలు సమైక్య దినం 



;

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం