అవధాన ప్రక్రియలో మొదట ఆవిర్భవించినది శతావస్థానం వందమంది ఫ్రుచ్చకులను కూర్చోబెట్టి వారు అడిగిన 100 మొదట పద్యంలో రెండు పాదాలు ఆ తరువాత ఒక భాగం చివరికి నాలుగో పాదం పూర్తిచేసి చివరిలో ఎవరి దగ్గరకు వెళ్లి వారి సమాధానం వారికి చెప్పడం తర్వాత మంచి పేరులోకి వచ్చింది ఎనిమిది మంది ఫ్రుచ్చకులను ఆహ్వానించి గోష్టిగా నిషిద్ధాక్షరి, వ్యక్తాక్షరి పురాణం అప్రస్తుత ప్రసంగం లాంటి ఎనిమిది పద్ధతులను ఎన్నుకొని వారిని తృప్తి పరచడం ఆ తర్వాత అనేక రకాల ప్రక్రియలు మన ముందుకు వచ్చాయి కోట శ్రీనివాసరావు సినిమాల గురించి రహంతుల్లా ఘంటసాల పాటల గురించి అవధానాలు చేయడం మనకు తెలుసు వారు కూడా ఎనిమిది మందిని ఎన్నుకుంటారు. నిజానికి ఎంతో పాండిత్యం ఉండి జీవితంలో ఎన్నో అనుభవాలతో కూడిన ధ్యానంతో అవధాన ప్రక్రియ జరుగుతుంది వారు ఎంత జ్ఞానులో ఫ్రుచ్చకులు కూడా అంత జ్ఞానులై ఉండాలి అప్పుడు అవదానం రక్తి కడుతుంది అక్షరజ్ఞానం లేని వ్యక్తి కుటుంబ పోషణ కోసం ఒక టాక్సీ నడుపుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న వాడు అవధాని కాగలడా అతని కార్యక్రమాన్ని ఒక్కసారి ఆలోచించండి ఎదుటివారి అవసరాలను తీర్చడం కోసం తన టాక్సీని ఉపయోగిస్తున్నారు చాలా దృష్టి గమ్యం వైపు ఉంటుంది ఎదురుగా వచ్చే వాహనాలు కానీ వ్యక్తులు కానీ అట్టు లేకుండా చూసుకొని వాటిని తప్పించుకుంటూ వెళ్ళవలసిన నేర్పు కలిగి ఉండాలి లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. తాను ఎదురుగా వచ్చే వాహనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకున్నట్లయితే వెనకనుంచి అడ్డదారుల్లో వస్తున్న వాహనాలు ప్రక్కనుంచి వచ్చే చిన్న సందులో నుంచి వచ్చే బళ్ళు చూసుకోకపోతే అతని పని జరగదు మధ్యలో తనతో పాటు వస్తున్న వాడు ఇంకా ఎంత దూరం ఇలా నిదానంగా వెళితే ఎలా అని ఒకడు వేగం పెంచితే, ఏమయ్యా మమ్మల్ని చంపడానికి తీసుకెళుతున్నావా అనే వాడు మరొకరు అప్రస్తుత ప్రసంగి ఎప్పటికప్పుడు ఏ ఊరు దాని చరిత్ర ఏమిటి అని అడగడం తప్ప ఇంతమందికి సమాచారాలు చెప్పుకుంటూ తనకు వచ్చిన కోపాన్ని దిగా మింగుతూ వారి గమ్యాన్ని చేర్చడం తన బాధ్యతగా స్వీకరిస్తాడు తన పని పూర్తి ఇంటికి వెళ్లిన తర్వాత అతని పరిస్థితి ఏమిటి అతని బీపీ ఎంత ఉంటుంది ఆలోచించండి ఎదుటివారి కష్టాన్ని తెలుసుకొని ప్రవర్తించవలసిన బాధ్యత మనపై ఉన్నది అని మరవకండి.
అవధానం; - డా.నీలం స్వాతిచిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి