పరమానందయ్య శిష్యులు-గురువుగారి కాళ్ల నొప్పి;- డా. భోజన్నగారి అనసూయ-నిజామాబాద్.99898 22494.
 పరమానందయ్య శిస్యుల పూర్వ వృత్తా0తం తెలుసుకుందామా! పూర్వం అరుణ మహర్షి అనే గురువు గారి దగ్గర పదమూడు మంది శిష్యులు ఉండేవారు. ఆ శిష్యులు ఇతరులకి ఎప్పుడూ అపకారం చేయరు. జీవులను హింసించరు. నమ్మినవారిని మోసగించే గుణం పిసరంత కూడా లేదు.చాడీలు అసలే చెప్పరు.పరస్త్రీలను మోహించరు. పొద్దస్తమానం వారు-వారి పనులు-గురువుగారు చెప్పిన పాఠాలు.అవి తప్ప ఆ పదమూడు మంది శిష్యులకు వేరే ప్రపంచమ్ అంటే ఏమిటో తెలియదు. 
  ఒకనాడు దేవకన్యలు భూలోకానికి వచ్చి,ఒక జలాశయంలో స్నానాలు చేస్తున్నారు. అక్కడికి వచ్చిన ఈ పదమూడు మంది శిష్యులు ఆ దేవకన్యలని వింతగా కళ్ళప్పగించి చూస్తున్నారు.వీరి ప్రవర్తనకు కోపగించిన ఆ దేవకన్యలు “మీరు బుద్ధిహీనులై పొండి” అని శపించారు.అప్పుడు అక్కడికి వచ్చిన అరుణ మహర్షి తన శిష్యుల అమాయకత్వాన్ని తెలియపరచి శాపవిముక్తి పొందే విధానం చెప్పమని ఆ దేవకన్యలని  అడిగాడు.”శంకరుని దయవలన శాపవిముక్తి కలుగుతుంది”అని చెప్పి ఆ దేవకన్యలు మాయమయ్యారు.
అంతట శిష్యులు అరుణమహర్షి ఆశీస్సులు పొంది, దేశసంచారం చేస్తూ,పరమానందయ్య అనే పేరున్న గురువుగారి దగ్గర శిష్యులుగా చేరారు. అమాయకులైన వారి గురువుగారు కూడా పాపం ఒక పిచ్చిమారాజు. ఆయనకు ఏనాడూ కోపమన్నది రాదు.పగ అన్నది తెలియదు.అంత సహనం,ఆదరణ,దయ ఇంకెవరిలో కనిపించవు.శిష్యులందరికి గురువుగారంటే మితిమీరిన భక్తి.ఆయన ఏ పని చెప్పినా పదమూడు మంది కలిసి వెంటనే చేస్తుండేది.ఈ గురువు-శిష్యుల కథలు ఎన్నో తరతరాలుగా పిల్లల్ని పెద్దల్ని అలరిస్తూనే ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే కదా!అందులోనుంచి ఒక కథ ఇప్పుడు మనం చూద్దాం.
ఒకరోజు గురువుగారు ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నారు.వెంటనే శిష్యులు పరుగెత్తుకువెళ్లి ఆయన కాళ్ళు చేతులు పట్టడం ప్రారంభించారు ఒక శిష్యుడు తాను పట్టుకున్న కాలే గొప్పదని అన్నాడు. ఇంతలో ఇంకొక శిష్యుడు తాను పట్టుకున్న కాలే ఇంకా మంచిదని వాదించాడు. ఇలా వాదిస్తూ శిష్యులు గురువుగారి కాళ్ళని కొట్టటం ప్రారంభించారు.పాపం గురువుగారు అవి తన కాళ్ళని ఎంత మొత్తుకున్న  వినిపించుకోలేదు.మిగతా శిష్యులు వాళ్ళ చర్యని ఎంతో ఉత్సాహంగా చూస్తున్నారు. నీ కాలు నరికేస్తానంటే నీ కాలు నరికేస్తానని కత్తులు తెచ్చి గురువుగారి కాళ్ళు నరికేయడానికి సిద్ధపడ్డారు. అప్పుడు గురువుగారి భార్య పరుగెత్తుకువచ్చి ఆ శిష్యులని తరిమికొట్టింది.
       
                       


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం