తానా అంతర్జాతీయ కవి సమ్మేళనానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
 ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా 
ప్రపంచ సాహిత్య వేదిక సెప్టెంబర్ 9 వ తేదీన
శ్రీ కాళోజీ నారాయణరావు జయంతి ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న
"తెలంగాణ భాషా దినోత్సవం"
సందర్భంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ కవి సమ్మేళనానికి విశాఖపట్నం కు చెందిన ప్రముఖ కవి తెలుగు వెలుగు సాహిత్య వేదిక జాతీయ కార్యవర్గ సభ్యులు  ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ గారిని ప్రత్యేక ఆహ్వానితులుగా తానా  సంస్థ వారు ఆహ్వానించారు.
తానా వారు నిర్వహిస్తున్న ఇంతటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో తనకు విశిష్టమైన స్థానాన్ని కల్పించినందుకు తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు గారికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర గారికి, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియచేశారు.
 ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు  పలు రచనలను రచించారు. అనేక సాహితీ సంస్థలలో భాగస్వామ్యులు. తెలుగు వెలుగు సాహిత్య వేదికలో  కార్యవర్గ సభ్యులు గా అనేకమంది కవులను ప్రోత్సహిస్తున్నారు.
అంతర్జాలంలో తానా నిర్వహిస్తున్న ఈ భాషా దినోత్సవం కార్యక్రమం యఫ్ టీవీ ద్వారా అనేక యూరప్ దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం అవటమే కాకుండా, తానా అధికారిక యూ ట్యూబ్ ఫేస్బుక్ చానల్స్ లో,ఈ టీ వి భారత్ వంటి దాదాపు పది పది యూట్యూబ్ చానల్స్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ప్రసాద్ మాష్టారు కి అంతర్జాతీయ గుర్తింపు రావడం పలువురు సాహితీమిత్రులు శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తు శుభాకాంక్షలు తెలియచేశారు.


కామెంట్‌లు