సి హేమలత గారికి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం.

చిత్తూరు జిల్లా,పుంగనూరు మండలం పుంగనూరు పురపాలక సంఘం ప్రాథమిక పాఠశాల ప్యాలస్ కాంపౌండ్ నందు ద్వితీయ శ్రేణి ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న సి. హేమలతకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా గౌరవం దక్కింది. గౌరవనీయులు శ్రీ. ఎంపీ రెడ్డప్ప గారు సబ్ కలెక్టర్ శ్రీ పి .శ్రీనివాసులు గారు చిత్తూరు నగర మేయర్ అముద గారి చేతులమీదుగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు సి. హేమలత  తన ఉద్యోగ జీవితాన్ని సంతృప్తిగా ఆస్వాదిస్తూ నిరంతరం విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. హేమలతకు జిల్లాస్థాయి ఉత్తమ అవార్డు రావడం పట్ల ఉపాధ్యాయ సంఘం నేతలు ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు
కామెంట్‌లు