అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 ప్రపంచంలో ఏ దేశ చరిత్ర అయినా తెలియజేయటానికి  ఆధారాలు ఏవైనా ఉన్నాయా  ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారు రాసే పుస్తకాలను ఆధారం చేసుకుని వీరు చెప్పడమేనా ఈ ఆలోచన మనసుకు వచ్చినప్పుడు  తర్కానికి అందని అనేక సందేహాలు మన మస్తిష్కాలలో మెదులుతూ ఉంటాయి  వాటికి సమాధానాలను వెతుక్కోవడం కోసం  అనేకమంది నేర్పరులను కలిసినా తనకు రావలసిన  సమాధానం రాదు అక్కడ ఉన్నత కులాలలో ఉన్న ఒక గుణం  తమకు తెలిసిన ఏవైనా తనతోనే ఉంచుకుంటాడు  తన కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ ఉంటాడు.  ప్రత్యేకించి  బ్రాహ్మణ కుటుంబాలలో ఇలాంటి విషయాలను మనం చూస్తూ  ఉంటాం  వాటిని ప్రత్యక్షంగా అనుభవించిన వారు ఉన్నారు.
శివ నాగిరెడ్డి గారు  ఏ ప్రయాణ వసతులు లేని గుంటూరు జిల్లా వడివెలు అన్న కుగ్రామంలో జన్మించి  తాను ఏ చదువు  కావాలనుకున్నాడో దానిని చదివాడు తర్వాత  వారిలో ఉన్న ఒక ప్రత్యేకత  ఆయన నడిచి వెళ్లేటప్పుడు ఎక్కడ ఇలా ఒక మంచి చిత్రం గోడమీద  గుడి మీద కనిపించినప్పుడు  ఆగి దానిలో ఉన్న సొగసులను ఆస్వాదించడం  చిన్నతనంలోనే అలవాటైంది  ఒక రాతిని అలా ఎలా మరచగలిగారు  అన్న ఆలోచన  తనను వదలలేదు  ఆ శిల్ప విద్య అంటే ఏంటో  గురువుగారు ఎక్కడ ఉన్నారో  అదే నేను నేర్చుకుంటే ఎలా ఉంటుంది  అలా ఆలోచనలన్నీ చేసి  చివరకు  ఆ విద్యలోనిష్ణాతులైన వారిని  కలిసి తన కోరికను తెలియజేస్తే  తన పేరు విన్న తరువాత  ఆ విద్యను నేర్పడానికి  వారు అంగీకరించలేదు. ఎవరికైనా ఈ సంఘటన వింటే ముందు జాషువా గారు జ్ఞాపకం వస్తారు  వారి మాటలు కవితవిని రైలులో ఒకాయన  మీ కులం  ఏమిటి అని అడిగాడు. ఆయన తెలియజేయగానే విముఖత్వం  వహించిన ఘట్టం హృదయవిదారక  మైనది  ఆ స్థితి శివనాగిరెడ్డి గారికి  అనుభవ పూర్వకంగా తెలిసి వచ్చి ఇలాంటి వారి వద్దకు వెళ్లడం అనవసరం  అనుకొని తన స్వయంకృషితో  తాను చూసిన  శిల్పాలలో ఉన్న  మలుపులను గమనించి  ఆ పద్ధతిలో  తీర్చిదిద్దడానికి  ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. అప్పుడు చరిత్ర గురించి తెలుసుకోవాలి  అనుకుని  శాసనముల ద్వారానే  అది సాధ్యం  అని గమనించి  దానికి కూడా ఉపాధ్యాయుడు దొరక్క  తన స్వయంకృషితో  దాని లోతులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు ఈనాడు స్థపతులలో  ఉన్నత స్థపతిగా  శాసనాలను చదవడంలో  రెడ్డి గారిని మించిన వారు మరొకరు లేరు  అన్న పేరు తెచ్చుకున్నారు.

.
కామెంట్‌లు