జనకవి జాషువ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం, 9492811322.
 ఒకరోజు అనుకోకుండా  నాలుగు లేక ఐదు సంవత్సరాల పసిపాప భౌతికకాయాన్ని  వారి కుటుంబ సభ్యులు తీసుకువచ్చి  ఆమెను కాలుస్తూ ఉంటే  ఆ క్షణంలో కన్నీటిధారలతో బాధపడిన వాడు  జాషువా గారు  ఆ చిన్నారి  పాప మరణాన్ని స్ఫూర్తిగా  తీసుకొని  అద్భుతమైన కవితను  శాశ్వతంగా నిలిచిపోయేదాన్ని  మన కందించిన  జన కవి  జాషువా గారు  ఎంతమంది రాజు  లు ఈ భూమి మీదకు వచ్చారు  ఏ ఒక్కరైనా మిగిలి ఉన్నారా  ఇంత చిన్న వయసులోనే తల్లిదండ్రులమనసులలో చిచ్చురేపి  హాయిగా ప్రశాంతంగా వెళ్ళిపోయావా చిట్టితల్లి  అంటూ వారు వ్రాసిన కవితను చదువుతూ ఉంటే  ఎంత  పాషాణ హృదయుడైనా అతని హృదయము నుంచి కన్నీరు వచ్చి తీరుతుంది  జాషువా గారి కవితకు ఉన్న  శక్తి అలాంటిది. ఒక కవితా గోష్ఠిలో
అధ్యక్షుల స్థానంలో  కూర్చున్న విశ్వనాథ వారికి  నీచమైన ఆలోచన వచ్చి వరుసలో మూడవ వారిగా ఉన్న జాషువా గారిని ఐదో వారిగా మార్చి  ఆరవ పేరుని తీసుకొచ్చి మూడు లో పెట్టి  ఇప్పుడు పంచముడు  తన కవితలు  వినిపిస్తాడు అనేసరికి జాషువా గారికి ఎక్కడలేని కోపం వచ్చి లేచి  తాను రాసిన కవిత ఉన్న కాగితాలను వేదికపైనే చించి వేసి ఆశువుగా పద్యాలు చెప్పారు దాని శీర్షిక గబ్బిలం  ఇది జంతువా పక్షా అని ఆలోచించేటప్పుడు  పిల్లలకు పాలిస్తుంది గనక జంతువు  ఆకాశంలో రెక్కల సహాయంతో ఎగురుతుంది కనుక  పక్షి  అన్న  అర్థం లో రాశారు  ప్రత్యేకించి బ్రాహ్మణ కులాన్ని దృష్టిలో పెట్టుకుని విశ్వనాథ వారి గురించి వ్రాసిన కవిత  ఆ తర్వాత వారి శిష్యులు ఎస్.టి జ్ఞానానందకవి  దీని రెండో భాగం రాయమంటే  గదిలో కూర్చుని రాస్తే జీవం ఉండదు  ఏదైనా సంఘటన జరిగి  అప్పుడు రాస్తే దానికి ప్రాణం వస్తుంది అని చెప్పిన జ్ఞాని జాషువా గారు. గోపరాజు రామచంద్ర రావు గారు (గోరా) సంఘసంస్కర్త  హేతువాది  ఎంఏ పాసై  గాంధీ గారి పిలుపుమేర  స్వాతంత్ర్య ఉద్యమంలో  పాల్గొన్న దేశభక్తులు  తర్వాత విజయవాడ వచ్చి  తన ఆశయాలను ప్రజలలోకి తీసుకవెళ్లడానికి  జీవితాంతం ప్రచారం చేశారు  కుల మత రహిత సమాజం కావాలని వారి కోరిక  అందరూ కలిసి ఒకచోట కూర్చుని సహ బంతి భోజనం చేస్తే  ఈ భేదాలు పోతాయి అన్న అభిప్రాయంతో  వారు ఏ గ్రామం వెళ్లినా ఆ కార్యక్రమాన్ని  ఏర్పాటు చేసేవారు  ఈ కార్యక్రమాలలో అప్పుడప్పుడు జాషువా గారు కూడా పాల్గొంటూ ఉండేవారు  వారికి కూడా ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి కనుక  ఉత్తరోత్తర వారిద్దరూ  వియ్యంకులు కూడా అయ్యారు.



కామెంట్‌లు