పతివ్రతల దేశం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 భారతదేశ ఉనికిని సంస్కృతిని సంప్రదాయాన్ని  ప్రపంచ  దేశాలకు తెలియజేసిన మహానుభావులు  ఆదికవి వాల్మీకి మహర్షి  తరువాత అనేక గ్రంథాలు రాసి మణి పూస లాంటి భారతాన్ని  అందించిన మహానుభావుడు  భారతము అంటే అజ్ఞాన తిమ్మిరాంధకారములో కొట్టుమిట్టాడుతున్న  వ్యక్తికి వెలుగును చూపే  గ్రంథం  పేరులోనే తాను వ్రాయదలుచుకున్న విషయాన్ని  స్పష్టంగా చెప్పారు  రామాయణము అంటే  రాముని చుట్టూ తిరిగేదని సీత చుట్టూ తిరిగేదని  చెబుతూ ఉంటారు పెద్దలు  కానీ లోతుగా ఆలోచించినట్లయితే  వేద సారములను  మొత్తాన్ని ఒకచోట పొందుపరచి  జటాయువు నుంచి  త్రిజట  వరకు రామాయణం అని చెబుతారు  వేదాంతులు.
జట అంటే  వేదం  ఆయువు అంటే ప్రాణం మూలం  వేదములకు మూలం  సామవేదం  దీనిని స్త్రీల  జడతో పోలుస్తారు  ప్రారంభ దశలో ఉన్న  చిన్న మెదడు  ఆలోచనలను క్రమబద్ధం చేసే  ప్రధాన అవయవం  అక్కడినుంచి జుట్టు మూడు పాయలుగా తీసి జడగా రూపొందిస్తారు  మూడు ఒక మాదిరిగానే ఉంటాయి  అల్లికలోభేదం  వేదములలో మూలం సామం  వాటిని మూడు వేలములుగా చేసినది త్రి జట ధర్మాన్ని ఎలా ప్రతిష్టించాలి అని చెప్పినవాడు వాల్మీకి మహర్షి అయితే  న్యాయాన్ని ఎలా  అనుసరించాలో చెప్పినవాడు వ్యాస మహర్షి  రామాయణంలో సీతమ్మ వారి పాత్ర ప్రధానమైనది  ప్రపంచానికే ఆదర్శప్రాయమైన పతివ్రత. వివాహానికి ముందు ఆమె తల్లి పిల్లలకు చెప్పిన మాట.వివాహమై  అత్తారింటికి వెళ్లిన తర్వాత  ఎలాంటి ధర్మాలను ఆచరించాలో  అన్నిటినీ వివరించి చివరిగా  భర్త మాట తప్ప మరొక మాటకు తావు ఇవ్వకూడదు  భర్తకు నీడలా వారి వెను వెంటనే ఉండాలి అని  సీతమ్మను అడవికి వెళ్లమని కైకేయి చెప్పలేదు  తన తల్లి చెప్పిన ధర్మాన్ని అనుసరించడం కోసం  అడవులలో  రాళ్ల మధ్య కంద మూలాలు తిని జీవించే స్థితిని కూడా  అమృత ప్రాయంగా  భావించి  సీతారాములు అన్న  శబ్దాన్ని శాశ్వతం చేసింది  ఊర్మిళ  తల్లి చెప్పిన మాటను ఆధారం చేసుకుని  భర్త ఎక్కడ ఉండమంటే అక్కడే ఉండి  తన శయన గృహంలో  అక్క అరణ్యవాసం నుంచి తిరిగి వచ్చేంతవరకు  నిద్రలో మునిగి ఉండేలా  దేవతలను ప్రార్థించి ఆవరాన్ని పొంది  అలా నిద్రలోకి వెళ్ళింది.


కామెంట్‌లు