శ్రీ రాముడు ; -కొప్పరపు తాయారు
 గుహేన సహితో  రామో లక్ష్మణేన చే సీతాయా !
తేవనేన వనం గత్వా నదీః తీర్త్వ బహు ఉదకాః !
త్రికూటం అనుప్రాప్య భరద్వాజస్య  శాసనాత్ !
రమ్యం అవసథం కృత్వా రమ మాణావనే త్రయః !
 
శ్రీరాముడు సీతా లక్ష్మణులు తోడను, గుహని  తోడను, గూడి  వనములలో   సాగిపోవుచూ, గుహు ని సాయంతో జల సమృద్ధి గల గంగానదిని దాటెను.
పిమ్మట భరద్వాజ మహర్షి ఆదేశమును అనుసరించి
రామలక్ష్మణులు మందాకిని నదీ తీరమున గల చిత్రకూటమునకు చేరిరి. అచ్చట చక్కని పర్ణశాల ను
నిర్మించుకొని ఆ ముగ్గురు దేవ గంధర్వ సదృశ్యులై
సుఖముగా ప్రశాంతముగా నివసింపసాగిరి.!
కామెంట్‌లు