మన పూర్వీకులు ఏ పని చేసినా ఏకాగ్రతతో చేయాలంటారు. ఏకాగ్రత లేకుండా చేసే పని ఫలితాలను ఇవ్వదు. విద్యార్థులు పరీక్షల కోసం చదువుతున్నా, ఉద్యోగులు ఏదైనా ప్రాజెక్ట్లో పని చేస్తున్నా లేదా ఒక పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నా ఏకాగ్రత అనేది ముఖ్యం. మనం మన పనిలో పెట్టే ఏకాగ్రతనే మన పనితీరును మెరుగుపరుస్తుంది, ఉత్పాదకతను పెంచుతుంది, మెరుగైన ఫలితాలను సాధించడంలో తోడ్పడుతుంది. అయితే నేటి వేగవంతమైన జీవితంలో చాలా మంది ఏకాగ్రతను సాధించడంలో విఫలమవుతున్నారు. ఒకేసారి వివిధ పనులను చక్కబెట్టడం, దైనందిన జీవితంలో నిరంతరంగా ఎదుర్కొనే ఒత్తిడి, ఆందోళనలు ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాయి. అంతేకాకుండా డిజిటల్ మీడియా ఏకాగ్రతను దెబ్బ తిస్తోందన్నది వాస్తవం. ఒకప్పుడు పుస్తకాలతో కుస్తీ పడే విద్యార్ధులు ఇప్పుడు అదే చదువును కంప్యూటర్లు, టాబ్లు, మెబైల్ ఫోన్ల ద్వారా లాగించెస్తున్నారు. ఫలితంగా వారి ఏకాగ్రత దెబ్బతినడంతో పాటు జ్ఞాపకశక్తి కూడా నశిస్తోంది. ఏకాధాటి పని నుంచి క్రమం తప్పకుండా విరామాలు తీసుకోవడం వల్ల మీ మనస్సుకు విశ్రాంతినివ్వండి. మీరు మరలా రీఛార్జ్ అవడానికి స్వల్ప విరామం ఉపయోగపడుతుంది. చదువుకునేందుకు మంచి వాతావరణాన్ని సృష్టించుకోవాలి. టీవీ, ఫోన్, కంప్యూటర్, మ్యూజిక్ ప్లేయర్కి దూరంగా ఉండాలి.
స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకోవాలి. విద్యకు ఒక అర్థం, పరమార్థం ఉండాలి.
ఏ పనికి ఎంత సమయం కేటాయించాలో పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. మల్టీ టాస్కింగ్ ఎప్పుడూ చేయకూడదు.
స్టడీ సెషన్స్కు నలభైనుంచి యాభై నిమిషాలకంటే ఎక్కువ సమయం కేటాయించొద్దు. అలసిపోకుండా ఉండేందుకు మధ్యమధ్యలో విరామం అవసరం.
మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. బాధలను, ఆందోళనలను మర్చిపోవాలి.
చదువుతున్నప్పుడు ముఖ్యమైన పాయింట్స్ను, టాపిక్స్ను పుస్తకంలో నోట్ చేసుకోవాలి. అవసరమైనప్పుడు వాటిని రిఫర్ చేసుకోవాలి.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి