దేవహూతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 మనపురాణాల్లో కొంత మంది మహిళలు తెలుసుమనకు.మరుగున పడిన భక్తి తో తరించిన స్త్రీ దేవహూతి.ఈమె శతరూప స్వాయంభువమనువు కూతురు.ఎల్లప్పుడూ మహావిష్ణువు ధ్యానం లో ఉంటూ పెళ్లి అంటే విరక్తి భావంతో ఉండేది.కానీ నారదుని సలహాపై కర్దమ ఋషిని పెళ్లి చేసుకుంది.పెళ్ళి నిరాడంబరంగా జరిగింది.ఇద్దరూ భక్తి మార్గం లో నడుస్తూ ఉన్నారు.కానీ గృహస్థు ధర్మాన్ని నిర్వహించాలి కాబట్టి సంసారం చేస్తూ 9మంది ఆడపిల్లల్ని కంటారు.వారిని తొమ్మిది మంది మహర్షులకు ఇచ్చి పెళ్లి చేశారు.శ్రీమహావిష్ణువు కర్దమునికి ఇచ్చిన మాట ప్రకారం కొడుకు గా పుడతాడు.ఆపై కర్దముడు సన్యాసం స్వీకరించాడు.కొడుకుపేరు కపిలుడు.తల్లిదేవహూతికి ఆధ్యాత్మిక భక్తి విషయాలు బోధించి తపస్సు లో మునిగి పోయాడు.కొడుకు ఉపదేశం తో దేవహూతి కూడా తపస్సు లో మునిగి దేహత్యాగం చేసింది.ఆప్రాంతం సిద్ధిపథంగా ఖ్యాతి గాంచింది.దేవహూతి బాల్యంలోనే భక్తి వైరాగ్యం కలిగింది.గృహిణిగా తల్లిగా 9మంది ఆడపిల్లల్ని కని పెంచి పెళ్లి పేరంటాలు చేసింది.ఆపై కొడుకు చెప్పిన ఆధ్యాత్మిక మార్గంలో పయనించి శరీరాన్ని త్యజించింది.ఆకాలంలో స్త్రీ స్వేచ్ఛ గా ఉంది.తల్లిదండ్రులు ఆడపిల్ల ఇష్టా ఇష్టాలు కనుక్కునేవారు.సంసారబంధాలు తీరాక ఆడవాళ్ళు తపస్సు లో మునిగి ముక్తి పొందారు🌹
కామెంట్‌లు