శ్రీ శిరిడీ సాయి ఊదీ దివ్య వైభవం; -సి.హెచ్.ప్రతాప్

 మహారాష్ట్ర లోని హర్ధా గ్రామంలో నివసించే ఒక వృద్ధుడు మూత్రకోశంలో రాయితో బాధపడేవాడు. ఆ రాయిని ఆపరేషను చేసి తీయాలని దాక్టర్లు సలహా ఇచ్చారు కాని అప్పటికే 70 సంవత్సరాల వయస్సు కలిగిన ఆ వృద్ధుడు స్వతాహాగా మనోబలం లేనివాడు కావడం చేత ఆపరేషనుకు ఒప్పుకొనలేదు. ప్రసిద్ధులైన దాక్టర్లు మందుల ద్వారా ఆ రాయిని కరిగించాలని చూసారు గాని అది సాధ్యపడలేదు. కనుక ఆ బాధ వలన ఇక మరణమే శరణ్యమని ఆ వృద్ధుడు తీవ్రమైన మనోవేదనను అనుభవించసాగాడు.ఒకరోజు ఆ గ్రామపు ఇనాముదారు ఆ వృద్ధుడు ఇంటికి ఏదో పని మీద రావడం జరిగింది.ఆ వృద్ధుడు పడే బాధను గమనించి తన వద్దనున్న శ్రీ సాయి వీభూతిని నీటిలో కలిపి ఆ వృద్ధుడు చేత త్రాగించాడు. అపరయోగీస్వరుడూ, పరబ్రహ్మస్వరూపీ అయిన శ్రీసాయినాధుని విభూతి మహిమ చూడండి. అయిదు సంవత్సరాలలో కరగని ఆ రాయి విభూతిని సేవించిన అయిదు నిమిషాలలోనే కరిగి మూత్రంతో పాటు బయటకు వచ్చింది.ఆ వృద్ధుని బాధ శ్రీఘ్రమే మటుమాయం అయ్యింది. తాను కోరకుండానె తన బాధను తగ్గించి తన జీవితంలో వెలుగురేఖలను నింపిన కలియుగదైవం శ్రీసాయికి ఆ వృద్ధుడు అనేక వేల కృతజ్ఞతలను తెలియజేసుకున్నాడు.
ఊదీ(వీభూతి) పంచడం కోసం బాబా ఆచరించడం వెనుక లోతైన అంతర్లీన ప్రాముఖ్యత ఉంది. విశ్వంలో కనిపించే అన్ని విషయాలు బూడిద వలె క్షణికమైనవని బాబా తన ఊదీ ద్వారా బోధించారు. చెక్కతో లేదా పంచభూతాల పదార్థంతో కూడిన మన శరీరాలు పడిపోతాయి, వాటి ఆనందాలన్నీ ముగిసిన తర్వాత నిర్జీవంగా మారతాయి మరియు బూడిదగా మారుతాయి. భక్తులకు వారి శరీరాలు భస్మం అవుతాయనే విషయాన్ని గుర్తు చేయడానికి బాబా వారికి ఊదీ పంచారు.
శ్రీ శిరిడీసాయి ఊదీ ధారణ శ్లోకం:
మహాగ్రహపీడాం మహోత్పాతపీడాం మహారోగపీడాం మహాతీవ్రపీడాం
హరత్యాసుతే ద్వారకామాయిభస్మం నమస్తే గురు శ్రేష్ఠ సాయీశ్వరాయ
శ్రీకారం నిత్యం శుభకరమ్ దివ్యం పరమం పవిత్రమ్
మహాపాపహరమ్ బాబా విభూతిమ్ దారయామ్యహమ్
పరమం పవిత్రమ్ బాబా విభూతిం పరమం విచిత్రం బాబా విభూతిం
పరమార్థ యిష్టార్థమోక్షప్రదాతం బాబావిభూతిం యిదమాశ్రయామి. 
కామెంట్‌లు