మానవత్వం; - సి.హెచ్.ప్రతాప్

 మన భారతీయ సంస్కృతి అతి ప్రాచీనమైనది,భవ్యమైంది, దివ్యమైంది.ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచింది. ఇందులో నైతిక విలువలు, నాగరికత విశిష్టతని ఎత్తిచూపిస్తాయి. మన సంస్కృతి సాహిత్య సంప్రదాయలలో మానవతా విలువలు వెల్లివిరిసి ప్రతిబింబిస్తాయి. అసలు భారతీయత అంటేనే మానవత్వం అనే విధంగా భారతీయ సంస్కృతి ప్రాచుర్యం పొందింది. అహింసా పరమో ధర్మః’ అన్నది మన వేదం. అదే మన వాదం, నాదంగా నిల్చింది. ‘ఆత్మవత్ సర్వ భూతాని, ’ అని చెబుత్ఫంది మన భగవద్గీత . పరోపకారమే పుణ్యమని, పరులను పీడించడమే పాపమని సకల వేదాలు ఘోషిస్తున్నాయి.న్సులో ఎంతో ప్ర‌గ‌తి సాధించాం అని చెప్పుకుంటున్న మ‌నిషి... మ‌నిషిగా ఉండ‌టం మాత్రం మరిచిపోతున్నాడ‌ని సామాజిక శాస్త్ర‌వేత్త‌లు, విశ్లేష‌కులు పేర్కొంటు న్నారు. పువ్వు  పుట్టగనే పరిమళించినట్టుగా బాల్యదశలోనే నీతికథలను బోధించాలి. పిల్ల చేత బాల్య దసలోనే మహనీయుల జీవిత చరిత్రను తెలపాలి. భగవద్గీతను పఠింపచేయాలి. భగవంతుని కథలను వినేట్ట్టు చేస్తే భగవంతునిపైన నమ్మకాన్ని కలిగిస్తే అందరిలోను ఉన్న పరమాత్మ అంశను చూచే నేర్పుఅలవడితే ఎవరికి వారు పరుల ప్రయత్నాలకు తమ చేయ నందిస్తారు.అప్పుడు మానవత్వంతో పాటు ఇతర ఉన్నత విలువలు వాటికవే అలవడతాయి. మూఢ నమ్మకాలను తొలగించి శాస్త్రీయదృక్పథాన్ని కలిగించి ప్రపంచమానవుల మధ్య అడ్డుగోడలను తొలగించి విశ్వమంతా ఒకే కుటుంబము అనే ఆదర్శభావనను వ్యాపింపచేసింది.మానవతాధర్మమే అందరినీ సక్రమమార్గంలో నిలిపి సజ్జనులుగా చేస్తుంది.దురదృష్టవశాత్తు నేటి విద్యావిధానంలో మానవత్వం వంటి  ప్రాధాన్యం లేకపోవడంతో పవిత్రమైన వృత్తులూ వ్యాపారాల్లా మిగిలిపోతున్నాయి. మనుషులకు ముందుగా మానవత్వం అవసరం. ఆ పైనే నైతిక విలువలు. నేడు ఎక్కువమంది నైతిక విలువలు వున్నట్లు నటిస్తున్నారు. వారిలో మానవత్వం మచ్చుకైనా కవిపించదు. మనుషుల్లో మానవత్వం పెరిగితే లోకం ఆనందంగా వుంటుంది.
కామెంట్‌లు