దేవతాభ్యో వరాం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ |
అయోధ్యాం ప్రస్థితః రామః పుష్పకేణ సుహృత్ వృతః |
భరద్వాజ ఆశ్రమం గత్వా రామః సత్యపరాక్రమః |
భరతస్య అంతికం రామో హనూమంతం వ్యసర్జయత్ |
తనవిజయమును శ్లాఘించుటకై వచ్చిన
దేవతలనుండి వరమును పొంది, శ్రీరాముడు ఆ
వరప్రభావముతో రణరంగమున మృతులై
పడియున్న వానరులను పునర్జీవితులను
గావించెను. పిమ్మట శ్రీరాముడు
సుగ్రీవవిభీషణాదిమిత్రులతో,
వానరులందఱితోగూడి పుష్పకవిమానముపై
అయోధ్యకు బయలుదేఱెను. !
శ్రీరాముడు తనవారితో భరద్వాజాశ్రమమునకు
చేరెను. "పదునాలుగుసంవత్సరములు పూర్తియైన
వెంటనే అయోధ్యకు తప్పక తిరిగి వత్తును" అని
భరతునకు తాను ఇచ్చిన మాటను
నిలబెట్టుకొనుటకై శ్రీరాముడు ముందుగా
హనుమంతుని భరతునియొద్దకు పంపెను.!
శ్రీ రాముడు ; కొప్పరపు తాయారు
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి