ద్రౌపది- ఏ.బి ఆనంద్- ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322

 అప్పుడు ధర్మరాజు ద్రౌపదిని  సమాధానపరుస్తూ ఓ ద్రౌపదీ నీవు కొంచెము నాస్తిక వాదమునకు సమీపంలో ఉన్నావు. నేను కర్మఫలము ననుభవించుటకు కర్మ చేయుట లేదు దానము చేయుట ధర్మము కనుక దానము చేస్తాను యజ్ఞము చేయవలసి ఉన్నది కనుక  నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తానే కానీ ఫలితాలను ఆశించను  అన్నప్పుడు ద్రౌపతి నేను విపత్తిలో ఉన్నాను కావున ఇలాంటి ప్రలాపన చేస్తున్నాను అన్నది  ఈ సంవాదం వింటున్న భీమసేనునిలో కోపము మేల్కొన్నది  అతడు నేడే సుదినముగా భావించి కౌరవులతో యుద్ధం చేయుటకు సమ్మతించండి అనగానే ధర్మరాజు  కేవలం సాహసంతో పనులు నెరవేరవు అన్నాడు ఇంతలో వేద వ్యాసుడు వారు అక్కడికి వచ్చారు. ఒకసారి పాండవులు కామ్యక వనంలో ఆశ్రమంలో ద్రౌపదిని ఒంటరిగా వదిలి పండ్లు ఫలాల నిమిత్తం అడవులోనికి వెళ్లారు అదే సమయంలో జైయద్రదుడు ఇతర రాజులతో కలిసి పాండవుల ఆశ్రమం ముందుగా వెళుతూ ద్రౌపదిని చూసి మోహించాడు  ద్రౌపది సౌందర్యాన్ని మోహించి దిగ్భ్రామ చెందిన జైయద్రదుడు ద్రౌపదిని సమీపించి మీరు ఎవరు అని ప్రశ్నించాడు  నేను ద్రుపద రాజు కుమార్తెను పాండవుల సతిని అని జవాబిచ్చింది జైయద్రదుడు మోహితుడై పాండవులను వదిలి తనతో వచ్చిన ఎడల ఆమెను పట్టమనిషిని చేస్తానని చెప్పాడు ద్రౌపది పట్టరాని కోపంతో నీకు మూడింది కనుకనే కన్ను నిన్ను  కానరా కున్నది అని గట్టిగా  మందలించింది  అయినప్పటికీ జైయద్రదుడు బలవంతంగా ద్రౌపదిని తన రథం పై ఎక్కించుకొని బయలుదేరాడు.
ద్రౌపది బిగ్గరగా ధౌమ్యుని పిలిచింది ధౌమ్యుడు పరిగెత్తుకొని వచ్చి కాలినడకనే రథమును వెంబడించాడు ఒక పాండవులు కూడా ఏదో అపశకునంతోచి పరుగు పడుకొని వచ్చారు ఆశ్రమంలోని దాసి విషయం వివరించింది పట్టరాని ఆగ్రహంతో పాండవులు తమ తమ  రథముల పై జైయద్రదుడు  సైన్యాన్ని సమీపించారు రథం వెనుక ఆక్రందన చేస్తూ పరిగెత్తుతున్న ధౌమ్యుని నింపాదిగా ఉండమని చెప్పాడు జైయద్రదుని రథంలోనున్న ద్రౌపదిని చూసిన పాండవుల క్రోధం కట్టలు తెరుచుకుంది. అర్జునుడి బాణ వర్షంతో అంధకారం కమ్ముకుంది. జైయద్రదుని సైనికులు నమస్కరిస్తున్నారు భయంతో సౌముడు రథం ముందు ఉన్న ఏనుగులను, సైనికులను తన గదతో సంహరిస్తున్నాడు.
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం