ఆకాశవాణి విజయవాడ కేంద్రం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 ఆ సంవత్సరంలో గుంటూరులో కాంగ్రెస్ మహా సభలు జరిగినప్పుడు శ్రీమతి ఇందిరా గాంధీ ప్రసార శాఖ మంత్రిగా ఉండి ఆ సభలో పాల్గొని మన ప్రత్యేకత చాటుకున్నది  ఆ సభలు అయిపోయిన తర్వాత విజయవాడ సెంటర్ కు వచ్చారావిడ దాదాపు గంటన్నర  ఆలస్యమైంది  ధర్మాన్ని చాటి ఇది నా తప్పు కాదు రోడ్డు బాగు చేస్తూ ఉండడం వల్ల జరిగిన పొరపాటు అని  తన నియమపాలనను సరిపెట్టుకుంది ఆమె పక్కన ఒక నాటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి  కాసు బ్రహ్మానంద రెడ్డి గారి ధర్మపత్ని శ్రీమతి రాఘవమ్మ గారు కూడా వచ్చారు  త్వరగా మా కళాకారులను పరిచయం చేయమంటూ ముందుకు నడిచారు. అప్పటికే మేము సమావేశమై కూర్చున్న స్థలంలో ఖాళీగా ఉంచి రేడియో కేంద్ర సంచారకున్ని ఇంజనీర్ని రెండు కుర్చీలలో కూర్చోబెట్టి వారి వెనక అధ్యక్షులను ఆఫీసు ఉద్యోగులను నిలబెట్టి వారి వెనుక నాలుగో తరగతి ఉద్యోగులను ఉంచి ఆ గనక అంటే చివరి వరుసలో మమ్మల్ని   నిలబెట్టారు.
అప్పటికే ఇందిరా గాంధీ తోపరిచయమున్న మా శ్రీవాత్సవ యండమూరి సత్యనారాయణ పరిచయం చేయగానే మా కళాకారులు ఎక్కడ అని ప్రశ్నించింది ఇందిరాగాంధీ  చివరి వరసలో అనగానే ఆమెకు వచ్చిన కోపాన్ని దిగమింగుకుంటూ చూడండి శ్రీ వాత్సవ గారు రేడియో బ్రతికిందంటే కళాకారుల వల్ల సితార్ సహానాయీ లాంటి వాద్య కళాకారులు చక్కగా నాటక సంభాషణలు చర్చగాను గోష్టిగాను మంచి రచయితలు వాటికి ప్రాణం పెట్టిన కళాకారుల కంఠాల వల్ల ప్రధాన పాత్ర వహించే వాళ్ళను చివరన నిలబెట్టడం ఏమిటి అని  మళ్ళీ ముందు వరుసలోకి పిలిచి అందరితో కరచాలన చేసి నవ్వుతూ మీ కష్టాలు ఏమిటి చెప్పండి అని అడిగారు. ఆంధ్ర భాష తప్ప మరి ఏ భాషా తెలియని వారం మేమంతా ఒక హిందీ అనువాదకుడు  మమ్మల్ని ఉద్దేశించి మీలో హిందీ తెలిసిన వారు ఎవరంటే రాచకొండను చూపించారు  శ్రీ వాత్సవ గారు రాచకొండ వారిని చూడగానే నమస్తే పితాజీ అన్నారు ఆవిడ నిజ జీవితంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ని పితాజీ అని పిలుస్తారు  రాచకొండ వారు కూడా గడ్డం చిన్నకోటు ఆకారం అది ఠాగూర్ లాగే అనిపించి అలా సంబోధించాను మీకు ఏమీ అభ్యంతరం లేదు కదా  అన్నారు ఆవిడ  చిరునవ్వు చిందించి రాచకొండ వాడు భారతదేశానికి వన్నె తెచ్చిన గొప్ప కవితో పోల్చడం నా అదృష్టం అలాగే పిలువండి అన్నారు.

కామెంట్‌లు
Popular posts
ఎఱ్ఱాప్రగడ . .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
చిత్రం
రక్తసంబంధం కన్నా గుణ సంబంధం గొప్పది!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం