సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -479
గుడ శ్లేష్మ న్యాయము
****"
గుడము అంటే బెల్లము, ఏనుగు,కవచము,కబళము,పొగడ చెట్టు.శ్లేష్మము అనగా కఫము,తెమడ అనే అర్థాలు ఉన్నాయి.
శ్లేష్మ రోగి బెల్లం తిన్నట్లయితే మొదలు శ్లేష్మము ప్రకోపించి అనగా ఎక్కువై ఆ తర్వాత వెనుకటి దానితో సహా బయటికి వస్తుంది అని అర్థము.
 మరి శ్లేష్మము  శ్లేష్మ రోగి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
 శ్లేష్మము అనేది వాయు మార్గము. కన్ను, నాసిక చుట్టూ ఒక సాధారణ రక్షణ పొర.అంటే సన్నని జిగట పదార్థం.ఇది శ్వాస కోశ మార్గాన్ని సుగమం చేస్తుంది.ముక్కు, గొంతు మరియు ఊపిరి తిత్తులలోని గ్రంథుల ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది.అనగా శ్వాస కోశ వ్యవస్థ ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది.
అయితే శ్లేష్మము కఫము ఒకే అర్థంతో చెప్పినప్పటికీ కఫము వ్యాధికి సంబంధించినది.అది శరీరము నుండి విసర్జించ డానికి సమస్యాత్మకంగా వుంటుంది.
ధూమపానం, అనారోగ్యంలో ఫ్లూ,జలుబు మరియు న్యుమోనియా వంటి అనారోగ్య సమయంలోనూ , వాయు కాలుష్యము వలన శరీరంలోని బాక్టీరియా లేదా వైరల్ కణాలను వదిలించుకోవడానికి ప్రయత్నించినపుడు కఫం ఎక్కువగా మారుతుంది.
శరీరంలో మితిమీరిన కఫము చాలా యిబ్బంది కరంగా ఉంటుంది. అదనపు కఫాన్ని వదిలించుకోవడానికి రెండు రకాల మార్గాలు ఉన్నాయి. మింగడం లేదా ఉమ్మి వేయడం.
మనిషి శరీరం  వాత పిత్త కఫ  శక్తులతో  రూపొందించబడినదని ఆయుర్వేదం చెబుతోంది.
మరి కఫ దోష నివారణకు  బెల్లం చాలా ఉపయోగకారి.కఫాన్ని తొలగించి ఊపిరి తిత్తులు మరియు శ్వాస కోశాన్ని శుభ్ర పరుస్తుంది శ్వాసను సులభతరం చేస్తుంది.
 బెల్లం తింటే మొదట ఆ తీపిదనానికి కఫం దగ్గు పెరిగినట్లు అనిపిస్తుంది కానీ శ్వాస కోశ ఆరోగ్యానికి బెల్లం చాలా మంచిది.ఊపిరితిత్తులను ఆరోగ్యంగా వుంచుతుంది.
అందుకే రోజూ వారీ దుమ్ము ధూళితో పని చేసేవారు, వాటితో సంబంధం ఉన్న వ్యక్తులు వారి గాలి మార్గాలను ఆరోగ్యంగా ఉంచడానికి క్రమం తప్పకుండా బెల్లం తీసుకుంటారు.
గుడ శ్లేష్మ న్యాయము అనేది ఆయుర్వేద, ఆరోగ్యానికి సంబంధించినదని మనకు అర్థమవుతోంది.మరి మన పెద్దవాళ్ళు  దీనిని ఒక న్యాయముగా చెప్పడంలో అంతరార్థం ఏమిటి అనేది తెలుసుకుందాం.
మనలోని దేహములోని ఊపిరి తిత్తులలో గల చెడును అనగా అనారోగ్యాన్ని నివారించడానికి  బెల్లం ఉపయోగిస్తారని అర్థమై పోయింది కదా!
'మనసులోని చెడును తొలగించేందుకు కూడా ప్రయత్నం చేయాలనీ, అది కూడా మనసును నొప్పించకుండా తీయ తీయని బెల్లం వంటి  మాటలతో చెడు ఈ "గుడ శ్లేష్మ  న్యాయము' చెబుతోంది.
 కాబట్టి  ఏదైనా కోపంతో చెబితే ఎదుటివారు దానిని    స్వీకరించడానికి ఇష్టపడరు.తీయని మాటలతో మనసును హత్తుకునే విధంగా మంచి మాటలు చెబితే మొదట విముఖత చూపినా ఆ తర్వాత ఎంతటి వారైనా మంచితనానికి విధేయులై  మంచి మార్గంలో నడుస్తారు అనేది ఈ న్యాయం ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం.
ఈ విషయాన్ని గ్రహించాం కదా మనం. మరి తీయని మాటలతో  ఎదుటి వారి మానసిక రుగ్మతలను తొలగించే ప్రయత్నం చేద్దాం.


కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం