సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -469
కూర్మాంగ న్యాయము
****
కూర్మము అనగా తాబేలు,ఉప వాయువుల్లో రెండవది. అంగం అంటే శరీరము,శరీర అవయవము,ఓయీ,అయ్యా, విభాగము అనే అర్థాలు ఉన్నాయి.
తాబేలు తన కాళ్ళు చేతులు,తల మొదలైన అవయవములను తన ఉదర భాగంలోకి లాగి జాగ్రత్తగా పెట్టుకుంటుంది. అవసరమైనప్పుడు తలను ఇతర అవయవాలను బయటికి తీస్తుంది.
ఇతర జంతువులకు,తాబేలుకు ఉన్న తేడా ఇదే. అవసరమైనప్పుడు  శరీర అవయవాలను బయటికి కనిపించేలా చేయడం, వద్దు అనుకుంటే లోపలికి దాచుకోవడం.
ఎందుకు ఇలా చేస్తుందో గమనించిన జంతు శాస్త్రవేత్తల పరిశోధనలో తనకు ఏదైనా హాని కలుగుతుందని అనుకున్నప్పుడు,ఎదుటి జంతువుల దాడి నుండి తప్పించుకునేందుకు, ఏవైనా కారణాల వల్ల భయపడినప్పుడు వెంటనే తలను, కాళ్ళు చేతులను చటుక్కున పొట్ట భాగంలోకి లాక్కుంటుందనీ,తనకు తాను సురక్షితంగా ఉండటం కోసం ఇలా చేస్తుందని తేలింది.
భారతీయ పురాణేతిహాసాలు, వేదాలు, ఉపనిషత్తులు తాబేలుకు ప్రత్యేకమైన స్థానం ఉంది.   శ్రీమహావిష్ణువు దశావతారాలలో ధరించిన  రెండవ  అవతారం కూర్మావతారం.
దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథను చూద్దామా.
దేవ దానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మధించడాని మందర పర్వతాన్ని కవ్వంగానూ,,వాసుకిని తాడుగానూ ఉపయోగించారు.అయితే మందర గిరి పర్వతం బరువుగా ఉండటం వల్ల మునిగి పోసాగింది. చేయాల్సిన కార్యం మధ్యలో ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది.అప్పుడు శ్రీమహావిష్ణువు కూర్మావతారం ధరించి ఆ కొండను తన వీపు మీద భరించాడు. ఈ కూర్మావతారాన్ని పోతన తన భాగవతంలో అద్భుతంగా వర్ణించాడు.
కేవలం హిందూ పురాణాలలో మాత్రమే కాదు చైనా, అమెరికాలోని కొన్ని స్థానిక ప్రజల పురాణాలలో కనిపిస్తుంది. తాబేలును ప్రపంచ తాబేలు అంటే ప్రపంచాన్ని  మోసే తాబేలు అంటారు.
  కూర్మం లేదా తాబేలు దృఢమైన పైకప్పు అనగా పెంకు లేదా డిప్పను కలిగి ఉంటుంది. తాబేలును జీవులన్నింటికీ వయసులో పెద్ద అయిన తాతగానో బామ్మ గానో చెప్పవచ్చు.
తాబేలు జీవిత కాలం ఎక్కువ.చాలా సంవత్సరాలు జీవిస్తుంది.భూమిపై ఎక్కువ కాలం జీవించే జీవి ఇదే.అతి ప్రాచీన కాలం నుండి అనగా ట్రయాసిక్ యుగము నుండి వీటిలో శారీరకంగా ఎలాంటి మార్పులు రాలేదు.
తాబేలు  గుడ్లు గోళాకారం లేదా అండాకారంలో ఉంటాయి.తాను పెట్టిన గుడ్లను సురక్షితంగా ఉంచడానికి భూమిలో ఇసుక లేదా మట్టిలో గుంతలు తవ్వి, వాటిల్లో రంధ్రాల్లో పాతి పెడుతుంది.
పుట్టినప్పటి పాలు తాపి,నడక నేర్పి... ఇలా ఎంతో సంరక్షణ చేసి, ఎన్నో నేర్పిస్తే కానీ మానవ శిశువు పెద్ద పెరిగి తన కాళ్ళ మీద తాను నిలబడగలుగుతుంది.కానీ తాబేలు పిల్లల విషయంలో అలా కాదు.
తమ పిల్లలను రక్షించడానికి, అవి ఎలా జీవించాలో నేర్పడానికి తల్లి తాబేలు వాటి దగ్గర వుండదు. గుడ్డు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచీ తామంతా తామే జీవన పోరాటం చేయాల్సి ఉంటుంది.
 ఇక తాబేలును అంతర్ముఖి అని ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుందనీ చెబుతుంటారు.అలాగే మౌనంగా వుండే జీవి అని కూడా అంటారు. కానీ అందులో నిజం లేదట. అవి కుక్క, పిల్లి,కోడిలా శబ్దాలు కూడా చేస్తాయట అయితే ఆ శబ్దాలు పెద్దగా వినపడవట లెండి. ఏది ఏమైనా అది మిత భాషిణి మృదు భాషిణి అని చెప్పుకోవచ్చన్న మాట.
 ఇలా  సాక్షాత్తూ ఆ శ్రీమహావిష్ణువు అవతారమైన కూర్మం గురించి బోలెడు విషయాలు విశేషాలు తెలుసుకున్నాం.
ముఖ్యంగా  తాబేలులో అందరికీ నచ్చేది మనమంతా ఆచరించాల్సింది ఏమిటంటే  ఎవరి జోలికి పోకుండా తన మానాన తాను వుంటుంది.అవసరమైనప్పుడు మాత్రమే తల బయటకు తీసి చుట్టూ పరికిస్తుంది.ఎందులోనూ తొందరపడదు. "తాబేలు లా నడుస్తున్నావేరా?" అని ఎవరైనా తనతో పోల్చి తిట్టినా,విమర్శించినా కోపం తెచ్చుకోదు. నడకలో మార్పుకు అసలు ఇష్టపడదు."నిదానమే ప్రధానము" అన్నది తాను సృష్టించుకున్న నినాదం, సూక్తి. ఎప్పటికీ దానిని అతిక్రమించదు.భూత దయ అనో, గొప్ప కోసమనో పెంచుకున్నా కుక్కలా విశ్వాసం చూపడం, వెంట పడి వదలకుండా తిరగడం లాంటి వేమీ వుండవు.
ఇలా తాబేలుకు ఉన్న లక్షణాలు అన్నీ మనకూ ఆచరణీయం, అనుసరణీయమే...
కాబట్టి మన పెద్దలు చెప్పినట్లు "కూర్మాంగ న్యాయము" అనేది 100శాతం  ఆచరణ, అనుసరణీయం కాబట్టి  మనం కూడా ఆచరిద్దాం.అనుసరిద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం