కదంబం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కష్ట సుఖాలు సామాన్యం  మనం చేస్తున్న ప్రతి పని సక్రమంగా అవుతుందన్న  నమ్మకం ఉండదు అది కాలం చేతిలో ఉంటుంది  కాలం అనుకూలంగా ఉంటే  గెలుస్తాం లేకపోతే ఓడిపోతాను  దీనిని గడియారపు ముల్లుతో  మన పెద్దలు పోలుస్తారు  సుఖాన్ని అనుభవించే పెద్ద ముల్లు చకచకా జరిగిపోతూ ఉంటుంది ఎక్కడ ఆగకుండా  చిన్న ముల్లు ప్రతిగంటకు ఏదో అవాంతరం వస్తుంది అక్కడ ఆగిపోతుంది ఆ తర్వాత  తిరిగి ప్రయాణం మొదలవుతుంది  కనుక కార్యసాధకులు ఎప్పుడు కూడా అపజయం వస్తుంది అని ఆలోచించకుండా  సానుకూల దృక్పథంతో మనం కార్యాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేస్తే తప్పక విజయాన్ని పొందుతాం.
అక్షరాలు లేకుంటే మాటలకు అర్థాలే లేవు  అక్షరం అంటేనే వీగిపోనిది  శాశ్వతంగా ఉండేది అని  స్నేహితుల్ని భాషతో పోల్చి చెప్పవలసినట్లయితే పాత స్నేహితులు కొంతమంది ఉంటారు కొత్తగా ఎప్పటికప్పుడు వస్తూనే ఉండే కొత్త స్నేహితులు కలుస్తూనే ఉంటారు. మన తత్వాలను పూర్తిగా అర్థం చేసుకున్న వాడు పాత మిత్రుడు వాడు అక్షరం లాంటివాడు ఆ మైత్రి జరగదు  అదే కొత్త స్నేహితుడు గనక వచ్చే వాడిని పద్యంతో పోలుస్తాం. పద్యం రాయడానికి అక్షరాలు ముఖ్యం  పాత స్నేహితుల తత్వాలను అనుసరించి కొత్త వారి తత్వాలను  తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు  మంచి స్నేహితుడిగా పరిగణించబడతాడు  భాషా పరంగా  అందంగా పోలుస్తారు కవులు అనేక వందల సంవత్సరాల బానిసత్వాన్ని పారద్రోలి  స్వేచ్ఛా స్వతంత్రంగా ఉండడానికి ఎంతో మంది పెద్దలు  తమ జీవితాలను త్యాగం చేశారు  మహాత్మా గాంధీ నెహ్రూ ఇలాంటి వారికి ఆ పేరు   దక్కింది. తరువాత దేశంలో ఉన్న స్త్రీలకు అనాధలకు  సేవ చేస్తూ ఎన్నో ఘన కార్యాలతో ప్రగతిని సాగించిన పెద్దల జీవితాలు  పూర్తిగా తెలియకపోయినా వారి పేర్లు కూడా ఈనాటి యువతరానికి తెలియదు అన్నది నిజం  సమాజంలో మార్పు రావడం కోసం ఎవరు ఏమేం పనులు చేశారు  అలా చేయడానికి వారు ఎన్ని కష్టాలు పడి అనుభవించవలసి వచ్చింది  పూర్తి వివరాలు ఇవ్వకపోయినా వారి పేర్లు వారు చేసిన మంచి పనులు  నేటి యువతకు తెలియజేస్తే  భవిష్యత్తులో వారి పిల్లలకు వారు తెలియజేసుకుంటూ  సమాజాన్ని ముందుకు తీసుకు వెళతారని అభిప్రాయంతో  ఈ ప్రయత్నం.


కామెంట్‌లు