సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-501
చంద్ర చంద్రికా న్యాయము/ చంద్ర జ్యోత్స్నా న్యాయము
****
చంద్ర అనగా చంద్రుడు, కర్పూరము, నెమలి పింఛంలోని కంటి చిహ్నము, నీరు, బంగారము.చంద్రికా అనగా వెన్నెల, జ్యోత్స్న ,ప్రకాశము నిచ్చునది,చంద్ర భాగానది, మల్లికా లత అనే అర్థాలు ఉన్నాయి.
చంద్రునితో బాటే చంద్రుని  యొక్క 🌙 వెన్నెల.చంద్రుడు లేకపోతే వెన్నెల లేదు. వెన్నెల వచ్చింది అంటే చంద్రుడు ఉన్నట్లే. ఇలా చంద్రుడూ, వెన్నెలా అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి.
 
ఇలా వ్యక్తి పుట్టినప్పటి నుంచీ మరణించేంత వరకు ఆస్తి ,అంతస్తు, వైభవంతో వెలిగిపోతూ వుంటే అలాగే ఎవరైనా మొదటి నుండి ఉన్నతమైన వ్యక్తిత్వంతో వెలుగులీనుతూ వుంటే  వారిని ఉద్దేశించి ఈ "చంద్ర చంద్రికా న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
 ఇలా చల్లని వెన్నెల కురిపించే చందమామ గురించి కొన్ని విశేషాలూ, విషయాలను తెలుసుకుందామా...
చందమామ అంటే ఇష్టపడని పిల్లలూ, వెన్నెల అంటే ఇష్టపడని పెద్దలూ ఎవరూ వుండరు.అలా మన అమ్మ అయిన అవనమ్మ తమ్ముడు. మనందరికీ చందమామ ఆత్మీయ మామ.అనురాగ  వెన్నెలలు పంచే అపురూప బంధువు.ఇక చంద్రుని వెన్నెలను వర్ణించని కవులు, రచయితలంటూ వుంటారా ? అంటే అస్సలు ఉండరు గాక ఉండరనే సమాధానం వస్తుంది.
అలా నృసింహ పురాణమును రచించిన ఎర్రన  వెన్నెలను ఎంతో అద్భుతంగా వర్ణించాడు. అలాగే కాళిదాసు శరత్కాల వెన్నెల  గురించి ఎంతో గొప్పగా వర్ణించడం కనిపిస్తుంది.
 ఇలా ఒకరా ఇద్దరా  నన్నయ్య,రామరాజభూషణుడు గారి దగ్గర నుంచి  చలం, తిలక్, నండూరి ఇలా ఎందరో కవులు, రచయితలకు వెన్నెల అత్యంత ఇష్టమైన కవితా వస్తువు.
ఇక వెన్నెల రావడానికి కారణం సూర్యుడు.సూర్యుని కిరణాలు చంద్రునిపై పడి ప్రతిబింబించే కాంతిని వెన్నెల అంటారు. అలా చంద్రుని నుంచి వెలువడే చల్లని వెలుగును వెన్నెల అంటారు.
ఈ వెన్నెల శుక్లపక్షంలో రోజు రోజుకూ పెరుగుతూ , కృష్ణ పక్షం లో రోజు రోజుకు తగ్గుతూ వుంటుంది. అమావాస్య తర్వాత మొదటి వెన్నెల నిచ్చే చంద్రుడిని నెల పొడుపు అంటారు.
 ఇలా చంద్రుడి వెన్నెల ఆనందాన్ని, హాయిని ఇస్తుంది. వెన్నెల కాలంలో ప్రకృతి మరింత శోభాయమానంగా కనిపిస్తుంది.
 
ఈ విధంగా వెన్నెలకూ, చంద్రునికి అవినాభావ సంబంధం ఉంది. అలాంటి వెన్నెలతో మనిషినీ, మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని  పోల్చుతూ ఈ "చంద్ర చంద్రికా న్యాయము"ను మన పెద్దలు ఉదాహరణగా  చెప్పారన్న మాట.
బంగారానికి తావి అబ్బినట్లు, కళ్ళల్లోంచి వెన్నెల కురియాలి. పెదవులపై వెన్నెల విరియాలి. మాటల్లో వెన్నెలామృతం జాలువారాలి. అప్పుడే మనిషి చందమామలా అందరికీ ఆత్మీయ బంధువు అవుతాడు.
 కొందరు వ్యక్తులు ఉంటారు ఎన్ని కష్ట నష్టాలు వచ్చిన  పెదవులపై చిరునవ్వు వెన్నెలలు వీడరు.మనిషన్నాక ఇలాంటివి రాకుండా వుంటాయా,ధైర్యంగా అమావాస్యను భరిస్తేనే వెన్నెల సొంతం అవుతుందని చెబుతుంటారు.
ఇలా ఎప్పుడూ చంద్రుడూ- వెన్నెలలా ఉండేవారికి ఈ న్యాయము నూటికి నూరు పాళ్ళు వర్తిస్తుంది.
మరి మనమూ "చంద్ర చంద్రికా న్యాయము"ను ఆదర్శంగా తీసుకుని అపర చందమామలమై  అందరి హృదయాలను గెలుచుకుందాం.మీరేమంటారు?

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం