వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచన పల్లి,9182244143.
 మానవ జీవితంలో  మంచివాడు చెడ్డవారు అని రెండు రకాలు  వీరిలో ఎవరైనా తప్పు చేయడం మానవ సహజం  తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే  అలాంటి తప్పు ఎప్పుడైనా ఒక వ్యక్తి చేసి ఉంటే  ఈ తప్పు నేను చేశాను అని ఒప్పుకొని  మళ్లీ జీవితంలో ఆ తప్పును  చేయకుండా ఉండేవాడు  బుద్ధిమంతుడు సమాజంలో సంస్కారoగా జీవితాన్ని కొనసాగించాలి అంటే  మీ నడత నడక కూడా  సరి చేసుకోవాలి  నీ వయసు కన్నా పెద్ద వారిని చూసినప్పుడు నమస్కరించడం  చిన్నవారిని  ప్రోత్సహించడం  బాధ్యత  గా స్వీకరించాలి  సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది తల్లిదండ్రుల దంపతులనుంచే తప్ప ఏ కిరాణా షాపులో దొరకని వస్తువు  వినయ సంపన్నుడువై సమాజంలో తిరుగుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ నీకు ఇచ్చే గౌరవ మర్యాదలు నీ ఊహకు   అందవు.తన కవిత ద్వారా సంస్కృత భాషకి గౌరవం తెచ్చిన మహా కవి  కాళిదాసు గారు  ఆయన ఒక సందర్భంలో పరదేశానికి బయలుదేరి న సందర్భంలో జరిగిన ఒక సంఘటన  మధ్యలో వారికి బాగా దాహం వేస్తుంది  కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గుడిసె కనిపిస్తే  ఆ ఇంట్లోకి వెళ్లి అక్కడ ఉన్న ఒక బాలికను అమ్మా నాకు దాహంగా ఉంది నీళ్లు ఇవ్వమని అడిగాడు అప్పుడు ఆ బాలిక మీరెవరో నాకు తెలియదు కదా నేను ఎలా ఇస్తాను అని   బదులిచ్చింది దానికి కాళిదాసు నేను ఎవరో తెలియక చెప్పండి అన్నాడు  అహంకారపూరితమైన మాటలు విని బాలికన్నది మీరు అబద్ధం ఆడుతున్నారు ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు వారు ఎవరో చెబితే మీకు నీళ్లు ఇస్తాను అంటుంది  కాళిదాసు కాసేపు ఆలోచించి నాకు తెలియదు గొంతు ఎండిపోతుంది  ముందు నాకు నీళ్లు ఇవ్వమని బ్రతిమలాడుకుంటాడు అయినా బాలిక కనికరించదు  ఇద్దరు బలవంతులు ఎవరో కాదు ఆకలి దాహం అని సమాధానం చెబుతుంది.ఇప్పుడు చెప్పండి ఎవరు మీరు అని అడుగుతుంది నేను బాటసారి ని అని అన్నాడు మళ్ళీ అసత్యం ఆడుతున్నారు బాటసారి అంటే ఒక చోట నుంచి మరోచోటికి తెలియకుండా వెళ్ళాలి. మీరేమో అలసిపోయారు కదా ఈ లోకంలో అలా అలిసిపోకుండా సంచరించే బాటసారులు ఇద్దరే ఉన్నారు వారు సూర్యచంద్రులు అని చెప్పి గుడిసెలోకి వెళ్లిపోయింది బాలిక  దాహానికి తట్టుకోలేక ఆ గుడిసె ముందు నిలబడి మాతా నీళ్లు ఇవ్వండి దాహంతో చనిపోయేలా ఉన్నాను అని ఎప్పుడైతే పలికాడో కాళిదాసు లోపల నుంచి ఒక ముసలామె బయటికి వచ్చి మీరు ఎవరో సెలవివ్వండి నీళ్లు ఇస్తానంది దానికి దీనంగా నేను అతిధి ని అని బదులు ఇచ్చాడు ఇద్దరు అతిథులు ఒకటి ధనము  రెండవది యవ్వనం  ఈ రెండు ఎప్పుడు వెళ్ళిపోతాయో మనకు తెలియదు అంటుంది ఆ ముదుసలి.

సమన్వయం ; డాక్టర్ . నీలం స్వాతి
 
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం