భరతుడు _గుహుడు! అచ్యుతుని రాజ్యశ్రీ
 రామాయణం లో అద్భుత వ్యక్తి అందరిచేత అనుమానం తో చూడబడిన వాడు భరతుడు కైక దశరథుల కొడుకు రాముని తర్వాత రెండో కొడుకు.అన్నని అడవి నుంచి తెచ్చి పట్టాభిషేకం చేయాలి అని ససైన్యంగా తల్లుల్తో బైలుదేరాడు.ముందుగా పశ్చాత్తాపంతో కైక బైలుదేరింది.ఇక్ష్వాకు వంశరాజుల చిహ్నం కోవిదారవృక్షం.దానికి రెండేసి ఆకులు గుత్తులు గుత్తులుగా పూలుంటాయి.భూమిలోపలికి త్వరగా తన వ్రేళ్ళు పోనిచ్చి బాగా ఎదిగి నీడనిస్తుంది.అయోధ్య అంటే శత్రుదుర్భేద్యనగరం.
భరతుని సైన్యం చూసిన ఆటవికుడైన గుహుడు ఎంత సమయస్ఫూర్తి ప్రదర్శించాడో చూడండి.
500 పడవల్లో 100మంది యుద్ధ యోధుల్ని సిద్ధం చేసి భరతుని అంతరంగం తెల్సుకోవాలి అని పళ్ళు పూలు తేనె మాంసం తో భరతుడున్న ప్రాంతం కి వెళ్లాడు.సుమంతుడు గుహుని రాకను భరతునికి చెప్పగానే వెంటనే లోపలికి పంపమన్నాడు భరతుడు.అవతలివాడి కులం తో పనిలేదు.భక్తిని చూశారు సుమంతుడు భరతుడు.
2 " భరతా! సైన్యంతో ఎందుకు వచ్చావు?" గుహుడు సూటిగా ప్రశ్నిస్తే "మా రఘుకులంలో అన్నదమ్ముల అనుబంధం ఆత్మీయత ఆదర్శం.ప్రజాక్షేమం మాలక్ష్యం.అన్న రామునికి పట్టాభిషేకం చేయాలి అని
మాముగ్గురు అమ్మలతో సహా వచ్చాను.అన్నగూర్చి చెప్పు.మాఅమ్మ సుమిత్ర మైత్రీ భావం కల్గిన ఆమె కడుపున పుట్టిన లక్ష్మణుడు అదృష్టవంతుడు." అప్పుడు గుహుడు నిషాదుడు ఇలా చెప్పాడు" నేను తెచ్చిన మర్రిపాలతో జుట్టుని శిఖలాగా చుట్టు కున్నారు.ఆఒక్కరాత్రి నేను అరటి దొప్పలు తెస్తే లక్ష్మణుడు దర్భలు పరిచాడు.రాముడన్నాడు_ మేము క్షత్రియులం.ఆహారం తినరాదు ఈసమయంలో.జనాల కడుపునింపాలి అనేది మావంశం ఆచారం.గంగాజలం తాగితే మనసు ప్రశాంతంగా పవిత్రంగా ఉంటుంది.తీసుకునిరా"
ఈమాటలు వింటున్న భరతుడు పచ్చని చెట్టు తొర్రలో దాగున్న అగ్ని లాగా బాధతో కుళ్లిపోతూ
తనపై వచ్చిన అపవాదు కి బాధపడసాగాడు.
3రాముడంటే లలితా గాయత్రీ అమ్మవారు.ఆమెయే గ్రామ దేవత గా పెద్దింటమ్మ పోలేరమ్మ గా పిలువబడుతోంది.శ్రీకృష్ణుడు శ్యామలాదేవి స్వరూపం.ఇక ప్రతిపేరుకి విశిష్టత ఉంది.సుమిత్ర అంటే మిత్రుడు భక్తి దైవం వైపు నడిపించేవాడు.కౌసల్య కోసలదేశపు రాకుమార్తె.కైక 
కేకయరాజు కూతురు.తండ్రి రాజ్యం పేరుతో వారు చెలామణి ఐనారు. కానీ సుమిత్ర తన పేరు తోనే ప్రసిద్ధి కెక్కినది.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం