వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచన పల్లి.
 భారతదేశానికే కాదు ప్రపంచ ప్రజానీకానికి  తలమానికమైన  భగవద్గీతను ఏడవ శతాబ్దంలో  శంకరాచార్యుల వారు  రచించారు  దానిలో ఒక విషయాన్ని గురించి ఆయన చెబుతూ  స్నేహితులు గాని బంధువులు కానీ వచ్చినప్పుడు వారితో మాట్లాడేటప్పుడు ఎంతో ప్రేమతో మాట్లాడడం మన అలవాటు  అయితే శంకరులు వారు చెప్పేది  మనం మాట్లాడే మాటల్లో ప్రేమ ఉండడమే కాదు మనసులో కూడా ఆ ప్రేమ నిక్షిప్తమై ఉండాలి  అది శాశ్వత ప్రేమ అనిపించుకుంటుంది అంటారు  కోపాన్ని గురించి చెబుతూ కోపం మనసులో దాచుకోకూడదు అది శత్రువు లాగా మనల్ని నాశనం చేస్తుంది  నిజమైన కోపం వస్తే దానిని తగ్గించుకోవడానికి వెంటనే  మాటలలో మాత్రమే వ్యక్తం చేయాలి తప్ప  మనసులో ఉంచుకోకూడదు   అంటారు ఆయన.మన దగ్గర ఏది ఉంటే దానిని సమాజంలో ఎవరికి ఉపయోగపడుతుందో వారికి వినియోగించడం  సరైన పద్ధతి  విద్యార్థి చదువుతున్నప్పుడు  ఆ విద్యలో ఉన్న మూల సూత్రాలను మీ స్నేహితులకు బంధువులకు  నేర్చుకోవాలన్న కుతూహలం కలిగిన వారికి చెప్పాలి  నీకు మించిన ధనం నీ దగ్గరే ఉంటే ఎవరికి అది ఉపయోగపడుతూ ఉంటుందో దానిని అర్థం చేసుకొని  దానికి సరిపడిన దానం ఇస్తూ ఉండాలి  మనకి ఏదైనా మంచి హోదా ఉంటే నలుగురికి జీవన ఉపాధిని కల్పించడానికి ప్రయత్నం చేయాలి  మంచి పరపతి గనక మనకు ఉంటే అది నలుగురికి మాట సాయం ద్వారా  సహకరించేదిగా ఉండాలి  ఇవేమీ లేకుంటే కనీసం నలుగురికి మంచిని గురించి చెప్పు లేకుంటే మౌనంగా ఉండు అంతేగాని  ఎవరికి అపకారం కీడు చేయడానికి ప్రయత్నించవద్దు అని మన మునులు చెప్పిన విషయం.విష్ణుమూర్తికి మనదేశంలో నాలుగు దిక్కుల నాలుగు విశ్రాంతి మందిరాలు ఉన్నాయి  వీటినే మన పెద్దవారు చార్ధామ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు  ఇందులో ప్రత్యేకించి రామేశ్వరంలో ఆయన స్నానం చేస్తాడు అని ప్రతీతి  ఆ తర్వాత ద్వారకకు వెళ్లి అక్కడ  తన కార్యక్రమాలు ప్రారంభించడానికి సిద్ధం అవుతాడు  అక్కడ నుంచి పూరి వెళ్లి అక్కడ భోజనం ఏర్పాటు చేసుకుంటాడు  ఆ తర్వాత బదరీనాథ్ లో ధ్యానం చేస్తాడు  కనుక ఊరిలో మహా ప్రసాదం అనే సంప్రదాయం ఉంది  దీనికి విపరీతమైన ప్రాముఖ్యం ఏర్పడింది అక్కడ ఆయనకు  సమర్పించిన 56 వంటకాలు భక్తులు చక్కగా  రుచి చూచే సౌలభ్యం ఉంది  మరి ఇవి చేసేది మామూలు మనిషి కాదు అని పూరి స్వాముల అభిప్రాయం  అయితే ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ కేవలం మహాలక్ష్మి మాత్రమే చేస్తుంది అని వారు సమాధానం చెప్తారు.
----------------------------------------------
సమన్వయం ; డా. నీలం స్వాతి 


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం