భాస్కర సేతుపతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 మనం రాజర్షి బ్రహ్మర్షి అనే పదాలు మన రామాయణం లో వింటాం.కానీ భారతదేశంలో అలాపేరుగాంచిన రాజులు సంస్థానాధిపతులున్నారు.అలాంటి రాజర్షి భాస్కరసేతుపతి రామనాథపురం కి అధిపతి.దేవీరాజరాజేశ్వరి వారి వంశ కులదేవత.వామాచారవిధానంలో అమ్మ వారి కి జంతుబలి ఇచ్చేరోజుల వి.ఆనాటి శృంగారి శారదాపీఠాధిపతులు జగద్గురువు నరసింహభారతీ స్వాముల వారు 1894 లో రామనాథపురం సంస్థానానికి విచ్చేశారు. రాజు భాస్కరసేతుపతి ఆయన్ని దర్శించి " స్వామీ! మారాజప్రాసాదంలో ఉన్న అమ్మ వారి ఉగ్రరూపంని మార్చండి" అని వేడుకున్నాడు. అంతే! స్వామివారు శ్రీచక్రంని ప్రతిష్ఠించారు. శృంగేరినుండి వైదికసాంప్రదాయంలో అర్చనచేసే పండితులను పంపారు. ఆరోజు కొడుకు రాజరాజేశ్వరన్ తో కల్సి రాజు పీఠాధిపతులను ఇలాప్రార్ధించాడు" స్వామీ! ఈసంస్థానంని మీకు కానుక గా అర్పిస్తున్నాను." అని తన కిరీటం ఖడ్గం ఆయన పాదాలదగ్గర పెట్టాడు.ఆయన  రాజరాజేశ్వరన్ కి తిరిగి ఆసంస్థానం ని అప్పగిస్తూ " ఇక్కడ సేతుపతుల పాలన కొనసాగుతుంది " అని ఆశీర్వదించారు. సేతుపతి శృంగేరి మఠానికి కొన్ని గ్రామాలను కానుక గా ఇచ్చారు. 20జనవరి 1897 లోస్వామి వివేకానంద విదేశీ పర్యటన ముగించి స్వదేశంకి రాగానే భాస్కరసేతుపతి " స్వామీ! ముందు మీపాదాలు నాతలపై పెట్టండి " అని వేడుకున్నాడు. కానీ స్వామి తిరస్కరించారు. కానీ ఆయన ఎక్కిన బండిని కొన్ని కిలోమీటర్లు లాగుతూ సేతుపతి పాంబన్ రాజప్రాసాదానికి తీసుకుని వెళ్లి న రాజర్షి గా మారాడు.వివేకానంద స్వామి రామనాథపురం లో బసచేసి రాజర్షి అనే బిరుదు ఇచ్చారు. 4జులైలో వివేకానంద మహాసమాధి చెందిన వార్త విని దిగులు తో తన 36వ ఏట1903 లో దైవసన్నిధి చేరిన ధన్యజీవి భాస్కరసేతుపతి 🌷
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం